ఈ మద్య సెలబ్రెటీలు ఏం చేసినా అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలు ఎక్కడ ఏం చేసినా చిటికెలో సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి చేరిపోతుంది. సినీ ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్లు చెట్టా పట్టాలేసుకుని తిరిగినా..పొలిటికల్ లీడర్స్ ఎలాంటి చెడు పనులు చేసినా అవి సోషల్ మాద్యమాల ద్వారా వెంటనే తెలిసిపోతుంది త్రిష ఎంత గొప్ప నటో అంతకు మించి ఆల్కాహాల్ సేవించడంలో టాప్ అని రూమర్లు ఉన్నాయి. గతంలో ఆమె ఓ పబ్లో మాజీ క్రికెటర్ హేమంగ బదానీతో పాటు టాలీవుడ్లో ఓ టాప్ ఫ్యామిలీకి చెందిన హీరోతో కూడా పబ్బుల్లో తాగి తందనాలు ఆడి మీడియా కంటపడి నానా గోలగోల చేసిన సంగతి తెలిసిందే. త్రిష తాగుబోతు అన్న విషయం సౌత్లో సినీ అభిమానులందరికి తెలుసు. నిన్న ఓ మంత్రి లుంగి డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యాడు.
తాజాగా సినీ నటి త్రిష ఫుల్లుగా మద్యం తాగి రోడ్డు మీద రచ్చ రచ్చ చేయడంతో ఓ యువకుడు ఆ తతంగమంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు ఇంకేముంది మరింత రచ్చ రచ్చ అయ్యింది. ఈ మద్యే హీరో రాంచరణ్ తో పార్టీ చేసుకున్న వీజువల్స్ సోషల్ మీడియాలో బయటపడి పెద్ద సంచలనమే సృష్టించాయి. తాజాగా త్రిష మద్యం తాగి చేసిన అల్లరి వీడియో మరింత సంచలనం సృష్టిస్తోంది. ఇకపోతే ఈ అమ్మడు ఈ పని ఎక్కడ చేసిందీ అన్న మాట తెలియకున్నా మొత్తాని అర్ధరాత్రి మాత్రం ఈ తతంగం జరిగినట్లు కనిపిస్తుంది.
ఈ వీడియో రాత్రి పూట తీసింది కావడంతో అంతా చీకటి గానే ఉంది. అయితే ఇలాంటివి నిషా కళ్ల త్రిషాకు పెద్ద కొత్తేమి కాదు గతంలో ఓ బీచ్ దగ్గర చిత్తుగా తాగి పోలీస్ ని తిట్టినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ అమ్మడు రోడ్డుపై ఫుల్లుగా తాగి హంగామా చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ భామ నటించిన నాయకి సెన్సార్ పూర్తిచేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది.