మంచు విష్ణు సరదాగా చేసిన ఒక ట్విట్ ఇంగ్లాండ్ ప్రజలను చాల ఖంగారు పెట్టినట్లు తెలుస్తోంది. యురోపియన్ యునియన్ నుండి బ్రిటన్ విడిపోవాలంటూ ఆ దేశవాసులు తీర్పును చెప్పిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ఒక కుదుపు కుదిపేసిన బ్రెక్సిట్ (బ్రిటన్ ఎక్సిట్)గా  సంచనలాలు సృష్టించిన ఈ రిఫరెండమ్ సంఘటన పై మంచు విష్ణు వేసిన జోక్ కు ఇంగ్లాండ్ లోని ప్రజలు షాక్ అయినట్లు తెలుస్తోంది.  

అసలు ఈ ప్రక్రియకు నాంది వేసి పూర్తి చేసింది తానే అని అంటూ ఒక షాకింగ్ ట్విట్ చేసాడు. ‘22వ తారీఖున లండన్ వచ్చాను. ఇప్పుడు యురోపియన్ యునియన్ నుండి బ్రిటన్ విడిపోయాక, పౌండ్ పడిపోయాక, ఇప్పుడు బయలుదేరుతున్నాను. మిషన్ పూర్తయ్యింది. ఇప్పుడు జేమ్స్ బాండ్  007 ఏం చేస్తాడో చూద్దాం’ అంటూ ట్వీట్ చేశాడు మంచు విష్ణు.  

వాస్తవానికి మంచు ఫ్యామిలీ అంతా లండన్ వెకేషన్ లో ఉండగా ఇలా జరిగిందని చెపుతూ బ్రిటన్ గూడఛారిగా 007 సినిమాలతోబాగా  ప్రాచుర్యం పొందిన  జేమ్స్ బాండ్ పాత్రతో తనను పోల్చుకుని   ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ విషయానికి తనదైన రీతిలో కామెడీ టచ్ ఇచ్చాడు మంచు  విష్ణు.  బ్రిటన్ అసలు యురోపియన్ యునియన్ నుండి విడిపోవడం వలన మన దేశానికి ఏమైనా నష్టం ఉందా నష్టం ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది అని చాలా మంది తీవ్రంగా ఆలోచిస్తున్న నేపధ్యంలో మంచు వారి అబ్బాయి ఇలా ట్విస్ట్ ఇచ్చి ట్విట్ పోస్ట్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.   

ఏమైనా మంచువారి కుటుంబం తీరు సెపరేట్ అని మరోసారి నిరూపించాడు మంచు విష్ణు. ఈమధ్య కాలంలో సినిమాలలో కంటే వ్యాపారాలలో బాగా దృష్టి పెడుతున్న మంచు విష్ణు అమెరికాకు చెందిన ఒక ఇంటర్ నేషనల్ స్కూల్ భాగ్యనగరంలో ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. దీనిని బట్టి చూస్తూ ఉంటే మంచు విష్ణు రానున్నరోజులలో సినిమాలకు దూరమై వ్యాపారాలకు దగ్గరయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: