తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్ గత సంవత్సరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంతో మంచి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఈ సంవత్సరం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ తో ‘సరైనోడు’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టడమే కాకుండా బన్నీకెరీర్లో ది బెస్ట్ పిక్చర్ అనిపించుకున్నాడు. అంతే కాదు అల్లు అర్జున్ కెరీర్లో 50 కోట్ల కలెక్షన్లు దాటిన చిత్రంగా రికార్డు నమోదు చేసుకుంది. ఇక బన్ని తదుపరి చిత్రంపై ఇప్పటికే పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో తమిళ డైరెక్టర్ లింగు స్వామితో బన్ని ఓ భారీ బడ్జెట్ సినిమా తీయబోతున్నాట్లు హంగామా మొదలైంది. అయితే  అల్లు అర్జున్ ఒక దశలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు నో చెప్పి పెద్ద షాకే ఇచ్చాడట.

 తమిళంలో విశాల్ తో సినిమా ఉండి కూడా విశాల్ ని కాదని అల్లు అర్జున్ కోసం ఆత్రుతగా ఎదురు చూసిన లింగుస్వామి కి పెద్ద షాకే ఇది. అయితే గతంలో పవన్ కళ్యాన్ కి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజకు సుబ్రమణ్మం ఫర్ సెల్ లాంటి సూపర్ హిట్ అందించాడు. దీంతో మెగా ఫ్యామిలీకి దగ్గరైన హరీష్ తో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు అల్లు అర్జున్ . ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు .

ఇప్పటికే దిల్ రాజు - అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ''ఆర్య '' , ''పరుగు '' అనే రెండు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇక దిల్ రాజు కాంబినేషన్ లో బన్నికి ఇది మూడవ చిత్రం కావడం ఈ చిత్రం హిట్ అయితే హ్యాట్రిక్ కొట్టేయొచ్చని అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: