త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ తో ఈ ఏడాది చివరన మొదలు కాబోయే సినిమా కధ పై ‘అత్తారింటికి దారేది’ ప్రభావం స్పష్టంగా ఉండబోతోంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి.  ఒక సూపర్ హిట్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నప్పుడు స్వచ్ఛమైన వినోదం అందించడమే తన లక్ష్యమని త్రివిక్రమ్ ఒక ఫంక్షన్ లో చెప్పిన విషయం తెలిసిందే. 

రీమేక్ కధలు పట్ల త్రివిక్రమ్ ఆసక్తి కనపరచడు అందువల్లనే త్రివిక్రమ్ సొంతంగా ఆలోచించి కధలు రాయడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటాడు.  రక్తపాతం, హింసలు లేకుండా తీసిన ‘అత్తారింటికి దారేది’ ‘అ ఆ’ తరహాలో పవన్ కాంబినేషన్ లో తాను రూపొందించబోయే సినిమాకు కధ రాయాలని త్రివిక్రమ్ తన స్టొరీ యూనిట్ తో చర్చలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

నిజానికి త్రివిక్రమ్ లో రచయితగా చాలా కోణాలు ఉన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్లు తనకు బాగా కలిసివస్తూ ఉండటంతో త్రివిక్రమ్ పవన్ తో తీయబోయే ఈ కొత్త సినిమాను ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్న కధలో కూడ కొన్ని ‘అత్తారింటికి దారేది’ పోలికలు అనుకోకుండా వచ్చిన నేపధ్యంలో ఆ అంశాలను తప్పించి మరో కోణంలో కధను తయారు చేయడానికి త్రివిక్రమ్ గట్టి కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   

వాస్తవానికి త్రివిక్రమ్ యాక్షన్ ఎంటర్ టైనర్లు కూడ బాగా తీయగలడని  ‘అతడు’ ‘ఖలేజ’ లాంటి సినిమాలు నిరుపించినా ‘అతడు’ ‘ఖలేజా’ సినిమాలు కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి. కానీ కలెక్షన్స్ సాధించ లేకపోయిన నేపధ్యంలో త్రివిక్రమ్ క్లీన్ ఫ్యామిలీ కథల పైనే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. అయితే పవన్ కొత్త సినిమా కోసం చేస్తున్న ఆలోచనలలో మరోసారి ‘అత్తారింటికి దారేది’ తరహా కధ బయటకు రావడంతో ఎలేర్ట్ అయిన త్రివిక్రమ్ తన కలానికి మరింత పదును పెట్టి మరో కొత్త కోణంలో పవన్ కోసం కధను తయారు చేయడానికి చాలా మేధో మధనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ అభిమానులు త్రివిక్రమ్ నుండి ‘కోబలి’ లాంటి మూవీ వస్తుందని ఆసిస్తూ ఉంటే తిరిగి త్రివిక్రమ్ ‘అత్తారింటి దారేది’ ని మళ్ళీ చూపిస్తాడా అంటూ భయ పడుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: