మెగా హీరోల్లో మంచి జోరులో ఉన్న సాయి ధరం తేజ్ రీసెంట్ గా తన నాలుగో సినిమా సక్సెస్ ఫుల్ 50 రోజులను కంప్లీట్ చేసుకున్నాడు. కెరియర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్న సాయి ధరం తేజ్ ఇక చేస్తున్న సినిమాల మీద కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే మెగా హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమా పట్ల అసంతృప్తిగా ఉన్నాడట. ఇంతకీ తేజు అన్ సాటిస్ఫైగా ఉన్న సినిమా ఏదంటే..


గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా అట.. ఫాదర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా ముందు అనుకున్నట్టుగా అవుట్ పుట్ రావట్లేదని దర్శకుడు గోపిచంద్, సాయి ధరం తేజ్ ఇద్దరు కలిసి చర్చించుకున్నారట. అయితే అందుకే ప్రాజెక్ట్ మధ్యలో రచయిత వెలిగొండ శ్రీనివాస్ సహకారం తీసుకుంటున్నారట. ఢమరుకం, అఖిల్, జబర్దస్త్, పండుగ చేస్కో సినిమాలతో రచయితగా క్రేజ్ సంపాదించిన వెలిగొండ శ్రీనివాస్ సాయి సినిమాకు పనిచేస్తున్నాడు.


ఓ పక్క సునీల్ రెడ్డి దర్శకత్వంలో తిక్క సినిమా షూట్ కంప్లీట్ చేసుకుంటున్న తేజు పార్లర్ గా గోపి సినిమాను కూడా చేస్తున్నాడు. తిక్క దాదాపు క్లైమాక్స్ షూట్ కు వచ్చేసింది. అందుకే ఇక గోపిచంద్ సినిమా మీద పూర్తి కాన్సెంట్రేట్ చేస్తున్నాడు. వరుస హిట్స్ తో క్రేజ్ మీదున్న తేజు ఆ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే సినిమా తీసేప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.


సుప్రీం సినిమాతో సుప్రీం స్టార్ గా ఎదిగిన మెగా హీరో ఆ సినిమాతో కెరియర్ లో బెస్ట్ హిట్ అందుకున్నాడు. మరి రాబోతున్న సినిమాల్లో కూడా తేజు ఇదే జోరుని కొనసాగిస్తాడనే నమ్మకంతో ఉన్నారు మెగా అభిమానులు. సాయి ధరం తేజ్ ఏం చేస్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: