గతంలో చిన్న చిత్రాలు అయినా, భారీ చిత్రాలు అయినా తెరకెక్కించి లాభాలు పొందేది ఒక్క దిల్ రాజు మాత్రమే. ఎవరిదైన చిన్న మూవీ అవుట్ పుట్ సరిగా రాలేదు అంటే, దాని ప్రివ్య్యూ చూసి...కొంత కటింగ్స్...ఇంకొన్ని యాడ్ చేసి...దాన్ని రిలీజ్ చేసి మరీ లాభాలను పొందేవాడు. ఇప్పుడు అదే దిల్ రాజు ఫార్మెట్ లో వచ్చి, దిల్ రాజు కంటే చిన్న సినిమాల విషయంలో భారీ లాభాలను పొందుతున్న దర్శకుడు, నిర్మాత మారుతి.

బ్లాక్‌బ‌స్ట‌ర్స్ క‌థ‌ల‌తో స‌క్సెస్ ల‌ను అందుకుంటున్న మారుతి తాజాగా తన క‌థ‌, స్క్రీన్‌ప్లే తో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌హ‌నిర్మాణం లో వస్తున్న చిత్రం రోజులు మారాయి. మొదటిసారి మారుతి, దిల్ రాజు కాంబినేషన్ నుండి వస్తున్న ప్రొడక్ట్ ఇది. గతంలో మారుతి చిత్రాలకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా చేశారు కానీ, ఏనాడు మారుతి చిత్రంలో డైరెక్ట్ గా పెట్టుబడులు పెట్టలేదు. కానీ మొదటి సారి దిల్ రాజు ఈ విధంగా చేయటంతో...ఇప్పుడు వీరిద్దరూ ఒకటిగా మారారు అనే టాక్స్ ఉన్నాయి.

అయితే ఈ రోజులు మారాయి చిత్రంలో దిల్ రాజు, మారుతి కంటే ఎక్కువ షేర్ ని తీసుకున్నారనే టాక్స్ వస్తున్నాయి. సహజంగా నిర్మాణంలో దిల్ రాజు పెట్టుబడులు పెట్టాడు కాబట్టి, రోజులు మారాయి మూవీలో మారుతి కంటే దిల్ రాజే ఎక్కువ ప్రాఫిట్స్ ని తీసుకునే ఛాన్స్ ఉంది. కానీ ఇందుకు మారుతి ఒప్పుకోవటమే ప్రత్యకతగా మారింది.

దిల్ రాజు బ్యానర్ లో ఓ పెద్ద హీరో మూవీకి మారుతి దర్శకత్వం చేసే ఛాన్స్ ఉంది. అందుకే దిల్ రాజు తో మారుతి కలిసి పనిచేయటమే కాకుండా, దిల్ రాజు కి ఎక్కవ వాటాని రోజులు మారాయి చిత్రానికి ఇచ్చారని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్స్. ఇక U/Aస‌ర్టిఫికేట్ అందుకున్న ఈ చిత్రం జులై 1న విడుద‌ల అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: