ఈ సంవత్సరం సమ్మర్ రేస్ కు ముగింపు పలుకుతూ 50 కోట్ల నెట్ కలక్షన్స్ ను సొంతం చేసుకున్న ‘అ ఆ’ సినిమాతో అ నిర్మాతకు నష్టాలు వచ్చాయంటే ఎవరూ నమ్మలేని విషయం. అయితే ఇది వాస్తవం అని అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ‘అ ఆ’ నిర్మాత రాధ కృష్ణ ఈసినిమాను 42 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేస్తే ఈసినిమాకు 36 కోట్ల బిజినెస్ మాత్రమే అయింది అన్న వార్తలు ఉన్నాయి.

దీనికి కారణం ‘అ ఆ’ విడుదలకు ముందు భారీ అంచనాలతో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా విపరీతమైన పబ్లిసిటీతో విడుదలైన మహేష్ ‘బ్రహ్మోత్సవం’ అంతకు ముందు పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ భయంకరమైన ఫ్లాప్ లుగా మారడం అని టాక్. దీనితో  త్రివిక్రమ్ ‘అ ఆ’ ను ఫ్యాన్సీ రేట్లకు కొనుక్కోవడానికి భయపడి బయ్యర్లు వెనక్కు తగ్గడంతో ‘అ ఆ’ నిర్మాత ఎంత ప్రయత్నించినా ఆ సినిమాకు 36 కోట్ల బిజినెస్ కు మించి చేయలేకపోయాడు అన్న వార్తలు ఉన్నాయి. 

అయితే ‘అ ఆ’ విడుదల అయ్యాక్ ఓవర్సీస్ తో పాటుగా మన ఇరు తెలుగు రాష్ట్రాలలోను బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని కలక్షన్స్ వర్షం కురవడంతో ఈసినిమాకు ఇప్పటికే 50 కోట్ల నెట్ కలక్షన్స్ వచ్చాయి అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈసినిమాను విడుదల చేసే సమయంలో ఈసినిమా నిర్మాత రాధాకృష్ణ ఓవర్సీస్ బయ్యర్లతో ‘వోవర్ ఫ్లొస్’ ఎగ్రిమెంట్ చేసుకోవడంతో ఈసినిమాకు ఓవర్సీస్ లో వచ్చిన విపరీతమైన కలక్షన్స్ వల్ల సుమారు 3 కోట్ల వరకు నష్టం రికవరీ అయింది అన్న వార్తలు వస్తున్నాయి.

దీనితో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి కూడ నష్టాల బారిన పడిన నిర్మాతగా రాధాకృష్ణ క్రియేట్ చేసాడు అంటూ ఆయన పై ఫిలింనగర్ లో సెటైర్లు పడుతున్నాయి. ఈ నష్టాలను తగ్గించు కోవాలని కాబోలు ఈ నిర్మాత ఈమధ్యనే పవన్ కళ్యాణ్ కు తన నిర్మాణ సంస్థలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించబోయే సినిమాకు ఇంకా ప్రారంభం కాకుండానే భారీ అడ్వాన్స్ ఇచ్చాడు అని టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: