తెలుగు ఇండస్ట్రీలో దగ్గుబాటి రామానాయుడు మనవడిగా స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిగా వెంకటేష్ వారసుడిగా వెండి తెరకు పరిచయం అయిన దగ్గుబాటి రానా చేసింది కొన్ని చిత్రాలే అయినా ఇండస్ట్రీలో మాత్రం విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. లీడర్ చిత్రంతో చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన రానా తర్వాత బాలీవుడ్ లో కూడ ఎంట్రీ ఇచ్చి అక్కడ సత్తా చాటాడు. గత సంవత్సరం రిలీజ్ అయిన ‘బాహుబలి’ చిత్రంలో హీరోతో సమానమైన పాత్రలో భల్లాల దేవగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రానా ఒక్క సినిమా పరంగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటాడు. అంతే కాదు టాలీవుడ్, బాలీవుడ్ లో ఎలాంటి ఈవెంట్స్ అయినా రానా చీఫ్ గెస్టుగా తప్పకుండా పిలిచే స్థాయికి ఎదిగాడు.

ఇక సినిమా పంరగా నే కాకుండా ఆటల్లో కూడా మనోడు చాలా ఉత్సాహాన్ని కనబరుస్తుంటాడు..ఆ మద్య ఇండియాలో చాలా గ్రాండ్ గా ప్రారంభమైన  ప్రొకబడ్డీ లీగ్ మ్యాచ్ కి సంబంధించిన కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నాడు. తాజాగా  ముంబాయి వేదికగా ఎస్వీపీ స్టేడియంలో ఈనెల 25 నుంచి ప్రొకబడ్డీ లీగ్ ప్రారంభం కానుంది. మొత్తం 60 మ్యాచ్ లను ఇక్కడ నిర్వహించబోతున్నారు.

ఇక మన భల్లాల దేవుడు తెలుగు టైటాన్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా రానా టైటాన్ జట్టు ఆటగాళ్లతో కలిసి దిగిన ఫోటోలను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసి ఆటగాళ్లను ఉత్సాహ పరిచాడు.. అంతే కాదు ఆటకు ముందు సరదాగా అంటూ ఫేస్ బుక్ లో  పేర్కొన్నారు.జులై31 వరకు ఈ ప్రొకబడ్డీ పోటీలు జరుగుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: