టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ చిత్రాలకి సరిగ్గా సరిపోయే హీరో గోపిచంద్. ఎమోషనల్ సీన్స్ ని పండిచగల సత్తా ఉన్న హీరోగా గోపిచంద్ పై ఇండస్ట్రీలో మంచి నమ్మకాలు ఉన్నాయి. గోపిచంద్ సరైన కథాంశాలను ఎన్నుకోవాలి కానీ, ప్రేక్షకులు సైతం గోపిచంద్ కి బ్రహ్మరథం పట్టేందుకు ఇప్పుడూ సిద్ధంగానే ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో గోపిచంద్ ప్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రాలను ఎంచుకుంటూ కొంత వెనకబడి ఉన్నారు. గోపిచంద్ రేంజ్ లో ఓ బ్లాక్ బస్టర్ సినిమా ఇప్పటి వరకూ రాలేదనే చెప్పాలి. య‌జ్ఞం తరహా చిత్రంలో గోపిచంద్ ని యాక్షన్ లో చూడాలని ప్రేక్షకులు ఇప్పటికీ కోరుకుంటున్నారు.

అయితే ఇది త్వరలోనే సాధ్యం కాబోతుందనే న్యూస్ ఇండస్ట్రలో హల్ చల్ చేస్తుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు, రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణలో ఇక నుండి కొన్ని చిత్రాలు రాబోతున్నాయని అంటున్నారు. బాహుబలి సీక్వెల్ తరువాత దీనికి సంబంధించిన పనులను రాజమౌళి స్టార్ట్ చేయనున్నారు. రాజమౌళి నుండి వస్తున్న కథలకు, తను దర్శకత్వ పర్యవేక్షణగా ఉంటూ..వారి శిష్యులచేత వరుస మూవీలు తీసుకురావాలని చూస్తున్నారంట.

ఇందులో భాగంగా గోపిచంద్ తోనూ ఓ కథని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో మాటలు వినపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణలో రాబోతున్న గోపిచంద్ మూవీ అంటే, కచ్ఛితంగా యాక్షన్ డ్రామా మూవీ అయి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న న్యూస్. 


మరింత సమాచారం తెలుసుకోండి: