చిరంజీవి హీరోగా వస్తున్న 150వ చిత్రం “కత్తిలాంటోడు”. ఈ మూవీకి సంబంధించిన షూటిగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ ని స్టార్ట్ చేసిన దగ్గర నుండి, ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సీన్స్ ని డైరెక్టర్ వినాయక్ చిత్రీకరణ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అన్న విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, చిత్ర యూనిట్ నుండి అఫిషియల్ గా ఒక్క పేరు కూడ బయటకు రావటం లేదు.


అతి త్వరలోనే ఈ విషయంలో ఓ నిర్ణయం బయటకు రానుంది. అయితే ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా ఉంటున్నసమంత, “కత్తిలాంటోడు” మూవీలో ఆఫర్ ని కొట్టేసిందని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, సమంత “కత్తిలాంటోడు”మూవీలో చిరంజీవి సరసన ఆఫర్ ని ధక్కించుకుంది కానీ, అది హీరోయిన్ రోల్ కి మాత్రం అస్సలు కాదంట.


కథలో భాగంగా ఓ సీన్ లో సమంత గెస్ట్ అప్పీరియన్స్ గా కనిపించనుంది. సమంత, నాగార్జునల మీద ఈ సీన్ ఉంటుందని అంటున్నారు. ఇక చిరంజీవి 150వ సినిమాగా పేరు తెచ్చుకుంటున్న ఈ మూవీలో ప్రముఖ హీరోలు అందరూ కొన్ని సీన్స్ లో కనిపించుందకు వినాయక్ ప్రయత్నాన్ని చేస్తున్నారు.


ప్రస్తుతానికి అయితే సమంత, నాగార్జునలు చిరంజీవి “కత్తిలాంటోడు” మూవీలో కనిపిస్తున్నారనే న్యూస్ మాత్రం ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. ఇక హైదరాబాద్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నతరువాత ఈ చిత్రంలోని మరికొన్ని సీన్స్ ని చెన్నైలో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: