ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో థియోటర్స్ వద్ద హంగామా చేస్తున్న మూవీ ఒకమనసు. ఈ మూవీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగశౌర్య హీరోగా నటించిన ఈ మూవీ మంచి లవ్ స్టోరీగా ప్రేక్షకుల మనస్సుని మెచ్చుకుంటుందని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీపై సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మంచి టాక్స్ వినిపిస్తున్నాయి. ఒకమనసు కథ తెలుగు ప్రేక్షకులను మెప్పించటంతో కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ కథపై కన్నేసింది. ఇప్పటికే స్టార్ హీరో ధనుష్ ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు హక్కులు సొంతం చేసుకున్నాడని అంటున్నారు.

అలాగే మరో వర్గం నుండి వినిపిస్తున్న టాక్స్ న చూస్తే, హీరో శింబు సైతం ఈ మూవీపై మనసు పడ్డాడని తెలుస్తుంది. అలాగే తమిళ రిమేక్ లోనూ నిహారికని హీరోయిన్ గా తీసుకునేందుకు శింబు ఆసక్తిగా ఉన్నాడనే వివరాలు తెలుస్తున్నారు. ఒకవైపు థనుష్, మరోవైపు శింబు ఒకమనసు మూవీపై వివరాలను సేకరించటంతో…ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారింది. అలాగే శింబు సైతం ఈ మూవీని రిమేక్ చేసే ఉద్ధేశంలో ఉన్నారు.

ఇందులో హీరోయిన్ గా మాత్రం నిహారికాని తీసుకువచ్చా లేదా? అనే విషయాలపై తను ఆలోచనలను చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. తమిళనాడులో ఒకమనసు మూవీపై జరుగుతున్న మూమెంట్స్ పై త్వరలోనే అధికారికంగా ఓ న్యూస్ బయటకు రానుందని అంటున్నారు. ఏదేమైనా ఇది ఒకమనసు నిర్మాతలకి లాభాలను తెచ్చే విషయం అని తెలుగు ఇండస్ట్రీ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: