తెలుగు తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగుతున్న సమంతకు తన అభిమానుల మధ్య ఒక అనుకోని సంఘటనలో ఆమె తీవ్ర ఇబ్బందులు పాలు అయింది అన్న వార్తలు వస్తున్నాయి.  కోలీవుడ్ మీడియా ఈవార్తలను బయట పెట్టింది. సమంత నిన్న ఆదివారం తమిళనాడు మధురైలో ఒక సంస్థ ఓపెనింగ్ కార్యక్రమానికి అతిధిగా వెళ్ళింది.

ఇక వివరాలలోకి వెళితే మధురైలోని వీ కేర్‌ సంస్థ తమ నూతన శాఖ ప్రారంభించేందుకు సమంతను పిలిచారు. ఆమె రావటం గురించి ముందే విపరీతమైన ప్రచారం జరగడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు అని తెలుస్తోంది. ఈ కార్యక్రమ ప్రాంగణానికి సమంత  లగ్జరీ కారులో ఆ ఫంక్షన్ దగ్గరకు వచ్చింది. అయితే ఊహించని విధంగా ఒక్క సారిగా ఆమెకోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆమె కారుని చుట్టుముట్టారు అని తెలుస్తోంది.

దానితో ఈ పోగ్రామ్ నిర్వాహకులు సెక్యూరిటీ సహాయంతో చాలా కష్టపడి సమంతను లోపలికి తీసుకెళ్లారు టాక్. అయితే ఆ కార్యక్రమాన్ని ఆమె ముగించుకుని తిరిగి వెళ్లేందుకు తన కారు వద్దకు చేరుకోవడంతో అక్కడ గుమిగూడిన ఆమె ఫ్యాన్స్ ఆమెను చుట్టుముట్టడమే కాకుండా మరికొందరు అమెకారు కారు టైరును కూడా పంక్చర్‌ చేయడంతో ఒక అనుకోని అలజడి ఏర్పడింది. దీనితో ఎలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగి సమంత అభిమానుల పై లాఠీ చార్జి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఊహించని ఈ సంఘటనకు షాక్ అయిన సమంత ఆ తరువాత నెమ్మదిగా తేరుకుని తిరిగి చెన్నై వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. అయితే తన విషయాలను ఎప్పటికప్పుడు ట్విటర్ లో పెట్టి హడావిడి చేసే సమంత ఈ విషయం పై మాత్రం ఇంత వరకు స్పందించ లేదు. అటు ప్రేమ వ్యవహారాలలోనే కాదు ఇటు ఫంక్షన్స్ లో కూడ సమంత ఉంటే చాలు అక్కడ సంచలన వార్తలే..


మరింత సమాచారం తెలుసుకోండి: