ప్రభాస్ మహేష్ ల మధ్య ఇప్పుడు విడుదల అవుతున్న సినిమాల పోటీ ఏమీ లేకపోయినా ఈనెల 30 జూలై 1 తారీఖులలో సింగపూర్ లో జరగబోతున్న ‘సైమా’ అవార్డ్స్ కార్యక్రమంలో ఉత్తమ నటుడు అవార్డ్ ఎవరికీ వస్తుంది అన్న టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోంది. ఆన్ లైన్లో నిర్వహించే ఓటింగ్ ద్వారా ఈ అవార్డుల ఎంపిక ఉంటుంది కాబట్టి ‘సైమా’ సినీ అవార్డులలో 2015 సంవత్సరానికి గానూ టాలీవుడ్ ఉత్తమ నటుడు విభాగంలో తీవ్ర ఉత్కంఠ పోరు నెలకొంది అన్న వార్తలు వస్తున్నాయి.

ఈప్రక్రియ ప్రారంభమైన తొలి రోజుల నుండి నువ్వా, నేనా’అన్నట్లు సాగుతున్న ఈ ఆన్ లైన్ పోరులో ‘శ్రీమంతుడు’ సినిమాకు గాను మహేష్ కు 1 శాతం ఆధిక్యంతో పట్టం కట్టబోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు 40 శాతం ఓట్లు ప్రిన్స్ మహేష్ కు రాగా, ‘బాహుబలి’ సినిమాకు గానూ ప్రభాస్ కు 39 శాతం ఓట్లు వచ్చాయి అని తెలుస్తోంది.

ఇక మధ్యలో ఫేక్ ఓట్లతో హడావిడి చేసిన  అల్లు అర్జున్ మూడవ స్థానంతో సరిపెట్టుకున్నాడని తెలుస్తోంది. నాని, వరుణ్ తేజ్ లు ఆ తర్వాత స్థానంలో నిలిచారు అని టాక్. దీనితో కేవలం 1శాతం ఓట్లతో ఆధిక్యంలో ఉన్న మహేష్ ను ఉత్తమ నటుడి అవార్డ్ కు ఎంపిక చేస్తారా ? లేదంటే ‘సైమా’ సెలక్షన్ కమిటీ ఓట్లు కూడ ఈ విషయంలో పరిగణలోకి తీసుకుంటారా ? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.

ఎప్పుడూ లేని విధంగా ‘సైమా’ అవార్డ్స్ కు సంబంధించి ఆన్ లైన్ ఓటింగ్ లో ఇంత నెక్ టు నెక్ పోటీ జరగడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. దీనికితోడు జూనియర్ నటించిన ‘టెంపర్’ ఈ ‘సైమా’ అవార్డ్స్ కమిటీ పరిగణలోకి  తీసుకోకపోవడంతో జూనియర్ అభిమానులు ఈ ఆన్ లైన్ ఓటింగ్ లో ప్రభాస్ కు ఓటు వేసరా ? మహేష్ కు ఓటు వేసారా ? లేదంటే తటస్థంగా ఉండిపోయారా అన్న అనుమానాలు కూడ ఉన్నాయి. ఏమైనా ఈ హోరాహోరి పోటీ రేపుతున్న ఉత్కంఠకు మరో రెండు రోజులలో తెర పడనున్నది..  



మరింత సమాచారం తెలుసుకోండి: