తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకొని మెగా అభిమానాన్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గత పది సంవత్సరాల క్రితం శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే సినిమాలో మెగా హీరోగా ఉన్నా రాజకీయాల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయారు..ఒకదశలో ఆయన స్థాపించిన పార్టీ ప్రజారాజ్యం కొన్ని నెలలకే కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పదవీ చేపట్టారు. ఇక రెండు రాష్ట్రాల విభజన తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ రావడం .. తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సన్నద్ధం కావడం జరిగింది. ఈ నేపథ్యంలో తన 150 చిత్రం తమిళ సినిమా ‘కత్త’ రిమేక్ చేయబోతున్నారు. అయితే ఆయన ఇమేజ్ కి తగ్గట్టు సోషల్ మెసేజ్ ఉన్న చిత్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రంలో చాలా మార్పులు చేర్పులు చేశారట.  

మొత్తానికి చిరంజీవి 150 చిత్రం ‘కత్తిలాంటోడు’ సెట్స్ పైకి రావడం షూటింగ్ జరగడం అంతా చాలా వేగంగా జరిగిపోతుంది. అయితే ఈ చిత్రం తర్వాత చిరు చాలా ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు..ఒకవేళ కత్తిలాంటోడు హిట్ అయితే అదే స్థాయిలో తన తదుపరి చిత్రం కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో నటసింహం నందమూరి బాలకృష్ణ తో సింహా , లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ లను అందించిన బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని చిరంజీవి తో చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడట.

ఆ మద్య సరైనోడు ఆడియో వేడుకలో చిరంజీవి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుందికదా..సింహా , లెజెండ్ చిత్రాలను చిరంజీవి తోనే చేయాలనీ రెండు సందర్భాల్లో కూడా చిరంజీవి ని కలిసి చెప్పాడట బోయపాటి అయితే ఆ కథల్లో స్వల్ప మార్పులు సూచించాడట చిరు దాంతో ఆ రెండు సినిమాలు బాలయ్య ని వరించాయి కట్ చేస్తే బాలయ్య కెరీర్ లోనే కాదు తెలుగు చలన చిత్ర చరిత్రలో గొప్ప హిట్ లుగా నిలిచాయి అని అన్నారు. ఇటీవలే అల్లు అర్జున్ కు సరైనోడు వంటి సూపర్ హిట్ నిచ్చాడు బోయపాటి దాంతో 151 వ చిత్రాన్ని బోయపాటి శ్రీను తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట .


మరింత సమాచారం తెలుసుకోండి: