టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో, నాని. ప్రస్తుతం తను నటించిన 'జెంటిల్మన్' చిత్రం సైతం బాక్సాపీస్ వద్ద మంచి సక్సెస్ ని సాధించింది. ఇదిలా ఉంటే తను 'ఉయ్యాల జంపాల' పేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయటానికి రెడీగా ఉన్నారు. ఇందులో కథా పరంగా ఇద్దరు హీరోయిన్స్ ఉండాలనేది దర్శకుడి నిర్ణయం.

అ విషయం హీరో కంటే ఇండస్ట్ట్రీలోని కొంత మంది హీరోయిన్స్ కి ముందుగానే తెలిసింది. ఈ విషయంలో ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ అయిన కొంత మంది నాని సరసన ఆఫర్ కోసం ప్రయత్నించారు. ఇక చివరినిముషంలో టాప్ హీరోయిన్స్ ని కాదనుకొని, నాని కొత్త హీరోయిన్స్ వైపు చూస్తున్నాడని తెలుసుకున్నారు.

తాజాగా వచ్చిన 'జెంటిల్మెన్'లో కూడా నాని సరసన ఇద్దరు హీరోయిన్స్ చేశారు. ఈ ఇద్దరి హీరోయిన్స్ తో నాని కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావటంతో, తన అప్ కమింగ్ మూవీలలోనూ ఈ ట్రెండ్ ని కొనసాగిస్తున్నాయి. అయితే నాని కోసం ఆసక్తి చూపిస్తున్న టాప్ హీరోయిన్స్ పేర్లని చూస్తే...ఒకరు నిత్యామీనన్ కాగా, మరొక రెజీనా కసాండ్ర అని అంటున్నారు.

ఈ ఇద్దరు బ్యూటీలు నాని కోసం ప్రయత్నించగా, నాని ఈ విషయాన్ని తెలుసుకున్నప్పటికీ కొత్త హీరోయిన్స్ పెట్టుకోవటంపై ఇండస్ట్రీలో హాట్ టాక్స్ నడుస్తున్నాయి. దీంతో రెజీనా కసాండ్ర, నిత్యామీనన్ గత కొంత కాలంగా నానికి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. జెంటిల్మెన్ చిత్రం విజయంతో నాని కి ఇండస్ట్రీలో మార్కెట్ పెరిగిందనే చెప్పవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: