ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ నిర్మాత బాలీవుడ్ నిర్మాతని టార్గెట్ చేసినట్టుగా ఇండస్ట్రీలో కథనాలు వినపిస్తున్నాయి. దీనికి సంబంధించని వివరాలను చూస్తే...తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న అప్ కమింగ్ మూవీ కబాలి. ఈ మూవీకి సంబందించిన పోస్టర్ విషయంలో పలు కథానాలు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కబాలి’ సినిమా జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచానాలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా విషయంలో ఓ వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ ఇర్ఫాన్ ఖాన్ నటించిన ‘మదారి’ సినిమా పోస్టర్‌ను ‘కబాలి’ టీమ్ కాపీ చేసిందని లీగల్ వ్యవహారాలు ఇద్దరి చిత్ర నిర్మాతల మధ్య జరుగుతున్నాయి.

మదారి పోస్టర్‌ ని కబాలి టీం కాపీ కొట్టిందనేది మదారి నిర్మాత ఫైర్ అయ్యాడు. దీంతో స్పంధించిన కబాలి నిర్మాత కళైపులి థాను... కాస్త ఘూటుగా రిప్లై ఇచ్చారు.  “‘కబాలి’కి సంబంధించి ఆ పోస్టర్ అభిమానులు తయారుచేసిన పోస్టర్..ఎక్కడా కాపీ కొట్టలేదు. కావాలంటే మీరు కూడ కబాలి పోస్టర్ ని అభిమానులు చేత కాపీ కొట్టించుకోండి.

బాలీవుడ్ మూవీ ఫాలో కావాల్సిన అవసరం మాకు అంతకంటే లేదు” అంటూ చెప్పుకొచ్చారు. కోలీవుడ్ నిర్మాత ఇంత ఘాటూగా మాట్లాడటంతో మాదారి మూవీ నిర్మాత సైతం రియాక్ట్ అయ్యారు. “మదారి ఇంటర్నేషనల్ మూవీ, ఒక వేళ కబాలి చిత్రయూనిట్ మా పోస్టర్ ని కాపీ కొట్టినట్టు తెలిస్తే..అప్పుడు నిర్మాత కు చెబుతాం అసులు సంగతి”అంటూ....ఒకరికొకరు ఘూటుగా మాట్లాడుకోవటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: