ఓ హిట్ కొట్టేసరికి మళ్లీ నితిన్ ఆలోచనలు ఎక్కడికో వెళ్తున్నాయి.. త్రివిక్రం సహకారంతో అఆతో 50 కోట్ల హిట్ తన సొంతం చేసుకున్న నితిన్ తనకు ఎప్పటినుండో ఉన్న మాస్ దురదను మరోసారి తీర్చుకోనున్నాడట. అదెలా అంటే తనకోసం ఎంతోమంది దర్శక నిర్మాతలు క్యూలో ఉంటే తాను మాత్రం ఓ మాస్ డైరక్టర్ కోసం ఎదురుఉచూస్తున్నాడట. 


ఆ దర్శకుడుతో కమిట్ అయ్యి మరోసారి తనలోని మాస్ యాంగిల్ చూపించాలని చూస్తున్నాడు నితిన్. ఇంతకీ నితిన్ ఏ డైరక్టర్ తో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడంటే సురేందర్ రెడ్డి అంటున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాం చరణ్ ధ్రువ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సురేందర్ రెడ్డి నితిన్ తో చర్చలు జరుపుతున్నాడట.


సూరీ చెప్పిన కథ నచ్చడంతో నితిన్ మరోసారి కమర్షియల్ హీరోగా హిట్ కొట్టాలని తహ తహలాడుతున్నాడు. అఆతో మెమరబుల్ హిట్ అందుకున్న నితిన్ మరి కెరియర్లో ఇలాంటి మాస్ ఇమేజ్ కోసమనే దాదాపు 7 సంవత్సరాలు 10 సినిమాల దాకా ఫ్లాప్ మూటకట్టుకున్నాడు. విక్రం దర్శకత్వంలో ఇష్క్ తనను బయట పడేసింది.   


మరి సురేందర్ రెడ్డితో చేస్తున్న ఈ ప్రయత్నం మళ్లీ తనకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అంతేకాదు నితిన్, సురేందర్ రెడ్డిల సినిమాతో చరణ్ కు షాక్ తగిలినట్టు ఉంది. ప్రస్తుతం చేస్తున్న సినిమా గురించి కాకుండా నితిన్ సినిమా గురించి సురేందర్ రెడ్డి ఎక్కువ ఆలోచన చేస్తున్నాడట. 



మరింత సమాచారం తెలుసుకోండి: