యువ హీరోల్లో శర్వానంద్ రూటే సెపరేట్ అని అనాలి.. ప్రయోగాలు చేస్తూ తనకు తానుగా ఓ కొత్త ఇమేజ్ ఏర్పరచుకున్న శర్వానంద్ రన్ రాజా రన్ తో న్యూ లుక్ తో తనలోని కామెడీ యాంగిల్ తో హిట్ అందుకున్నాడు. ఇక మళ్లీ మళ్లీ ఇది రాని రోజు క్లాస్ హిట్ అవ్వగా.. మరోసారి ఎక్స్ రాజా అంటూ కామెడీతో కలర్ ఫుల్ హిట్ అందుకున్నాడు. మేర్లపాక గాంధి డైరెక్ట్ చేసిన ఎక్స్ ప్రెస్ రాజా ఈ సంవత్సరం సంక్రాంతికి పెద్ద సినిమాల నడుమ రిలీజ్ అయ్యి పెద్ద విజయం అందుకుంది. ఈ ఇయర్ సంక్రాంతిలో ఎక్స్ ప్రెస్ రాజాకు తోడుగా ఒక సూపర్ హిట్, ఒక హిట్, మరోటి యావరేజ్ సినిమాలు వచ్చాయి కాబట్టి సరిపోయింది.  


అయితే ఈ పొంగల్ కిక్ తో మరోసారి తన సినిమా వచ్చే పొంగల్ ఫెస్టివల్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నాడు శర్వా. ప్రస్తుతం చంద్ర మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్ ఆ తర్వాత దిల్ రాజు నిర్మాతగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శతమానం భవతి సినిమా చేస్తున్నాడు. కథ కథనాల మీద ఉన్న నమ్మకంతో శర్వానంద్ ఈ సినిమాతో మరోసారి సంక్రాంతి రేసులో ఉండాలనుకుంటున్నాడు.


అయితే ఈ సంక్రాంతి కన్నా వచ్చే సంక్రాంతికి బడా సినిమాలు ఎక్కువ. ఓ పక్క నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి, మరో పక్క మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కత్తిలాంటోడు సంక్రాంతికి సిద్ధం అంటుంటే.. ఈసారి పొంగల్ కు నేను రెడీ అంటున్నాడు సోగ్గాదు నాగార్జున.. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో హతిరాం బాబా బయోపిక్ తో వస్తున్న ఓం నమో వెంకటేశాయ కూడా సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. మరి ఈ పోటీలో శర్వానంద్ సినిమా రావడం ఎంతవరకు శ్రేయష్కరం అనేది ఆలోచించాలి. నిర్మాత దిల్ రాజు కాబట్టి సినిమా రిలీజ్ విషయంలో కచ్చితంగా తొందరపడకుండా సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: