ఒక మూవీ  సక్సెస్ కావాలంటే ఎన్నో కాంబినేషన్స్ జతపడి ఉంటాయి. ప్రతి విభాగానికి సంబంధించిన వారి సలహాలను తీసుకుని డైరెక్టర్ వాటిని శ్రద్ధగా పట్టించుకుంటే ఆ మూవీ విజయానికి కారణం అవుతుంది. ఆ విధంగానే ప్రస్తుతం రాబోతున్న అప్ కమింగ్ మూవీ విషయంలోనూ ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు తన అనుభవాన్ని చూపించాడు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దిల్ రాజు, మారుతిలు ఇద్దరూ సక్సెస్ ఫుల్ కెరీర్ ని కొనసాగించినవాళ్ళే. ఇద్దరూ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలను ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించిన వారే. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం రోజులు మారాయి.మారుతి తన సొంత బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, శ్రేయాస్ శ్రీనివాస్‌లతో కలిసి నిర్మించిన సినిమా ‘రోజులు మారాయి’. 

ఈ మూవీని కొత్త దర్శకుడు మురళి తెరకెక్కించాడు. అయితే మారుతి స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే ఈ మూవీకి అందించారు. అలాగే ఫైనల్ అవుట్ పుట్ సైతం మారుతినే స్యయంగా చూసుకున్నారు. జూలై 1న ఈ మూవీ పెద్ద ఎత్తున విడుదల అవుతుంది. ఇదిలా ఉంటే దిల్ రాజు ఇందులో పెట్టుబడులు పెట్టడంతో చివరి నిముషంలో ఫైనల్ అవుట్ పుట్ ని చూసి షాక్ అయ్యాడు.

చాలా సీన్స్ వీక్ గా ఉన్నాయని గమనించి, కచ్ఛితంగా కొన్ని సీన్స్ ని తీసేయాలి అని మారుతికి చెప్పాడంట. దీంతో మారుతి సైతం ఆ సీన్స్ ని చిత్రం నుండి తొలగించటంతో ఇప్పుడు మూవీ చూడదగ్గట్టుగా ఉందని అంటున్నారు. ఏదైమైనా దిల్ రాజు, మారుతి పై కమాండ్ చేయటంతో తన సీనియారిటిని చాటుకున్నారని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: