సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో మెమెరబుల్ అవార్డ్ చేరింది.. ప్రస్తుతం సింగపూర్ లో జరుగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీస్ సైమా అవార్డుల్లో శ్రీమంతుడు సినిమాకు గాను మహేష్ బెస్ట్ యాక్టర్ గా అవార్డును కైవసం చేసుకున్నారు. అయితే ఆన్ లైన్ పోలింగ్ ద్వారా ఎన్నుకోబడే ఈ అవార్డ్ విన్నర్ ను మహేష్ బాబు అత్యధిక పోలింగ్ సంపాదించడంతో శ్రీమంతుడు ఖాతాలో మరో బెస్ట్ అవార్డ్ వచ్చింది. 


రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్న మహేష్ సైమా అవార్డ్ కూడా అందుకోవడం విశేషం. కొరటాల శివ దర్శకత్వంలో ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో వచ్చిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్ని కొల్లగొట్టి సరికొత్త రికార్డ్ సృష్టించి మహేష్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఇక ఇదే సినిమాకు గాను బెస్ట్ ఫీమేల్ యాక్టర్ గా శృతి హాసన్ గా కూడా అవార్డ్ అందుకున్నారు.


మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన శ్రీమంతుడు సినిమా ఈ రేంజ్ హిట్ అవ్వడంలో మ్యూజిక్ మిరకిల్ దేవి శ్రీ ప్రసాద్ కూడా ఓ భాగమయ్యాడని చెప్పాలి. వీక్షకులకు మంచి జోష్ ఇచ్చే పాటలతో సూపర్ ఆల్బంతో సినిమా హిట్ లో పాటలు కూడా ఓ బెస్ట్ యాస్పెక్ట్ అయ్యేలా చేశాడు. ఇక వీరే కాకుండా రానా, అల్లు అర్జున్, సమంత, సుధీర్ బాబు, రాజేంద్ర ప్రసాద్ లు కూడా సైమా అవార్డ్ సొంతం చేసుకున్నారు. 


ఇక నిన్న జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.. రీసెంట్ గా సినిమా అవార్డుల్లో అదరగొట్టిన చిరు సైమా వేడుకల్లో కూడ స్టేజ్ షో ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఎంతోమంది సిని తారల డ్యాన్సులతో సైమా కలర్ఫుల్ గా సాగిందట. ఇక మిగతా భాషల అవార్డులను రెండో రోజు అనగా ఈరోజు కూడా అవార్డులు ఇవ్వనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: