ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ధృవ‌. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న ఈ సినిమా పై మెగా అభిమానుల్లోనే భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే బ్రూస్ లీ నిరాశ తరువాత వస్తున్న సినిమా కావటంతో, అందులోనూ బ్లాక్ బస్టర్ తమిళ రిమేక్ కావటంతో అందరూ ఈ మూవీపైనే భారీ అంచానాలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం క‌శ్మీర్‌లో చిత్రీక‌ర‌ణ చేసుకున్న ఈ చిత్ర టీం షూట్ ని పూర్తి చేసుకుని హైద‌రాబాద్‌ కి వచ్చారు. అలా వచ్చారో లేదో, హీరోగారూ అప్పుడే మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో హడావిడే చేసేందుకు రెడీ అయ్యారు. తండ్రి నటిస్తున్న 150వ చిత్రంకి రామ్ చరణ్ సైతం నిర్మాతగా ఉండటమే కాకుండా, అన్నీ పనులు తానే స్వయంగా చూసుకుంటున్నారు.

మరో వారం రోజుల పాటు రామ్ చరణ్ చిరంజీవి కత్తిలాంటోడు మూవీ సెట్స్ లో హంగామా చేయనున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ రెగ్యులర్ గా సెట్స్ మీద కనిపించనున్నారని తెలియటంతో అటు అభిమానులు సైతం చిరంజీవి మూవీని లొకేషన్స్ లో చూడాలని హైదరాబాద్ కి వస్తున్నారంట.

మరోవైపు రామ్ చరణ్ తన మూవీ ధృవ‌ ఫ‌స్ట్‌ లుక్ టీజర్ ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో చరణ్ లుక్ గతంలో కంటే స్మార్ట్‌ గా ఉన్నాయంటూ ఇండస్ట్రీ నుండి కాంప్లిమెంట్స్ ని అందుకుంటున్నారు. ఇక `త‌ని ఒరువ‌న్‌`లో విల‌న్‌గా న‌టించిన అర‌వింద్ స్వామినే ఈ చిత్రంలోనూ చరణ్ సరసన విల‌న్‌గా న‌టిస్తున్నారనే విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: