ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో రియాలిటి అనే ఒక మత్తు లాంటింది. ఏదైనా సన్నివేశం రియాలిటిగా రావటం కోసం దర్శకులు, స్టార్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. వారికి కావాల్సిన సన్నివేశం రియాలిటిగా ఉండేందుకు ఒక్కో సందర్భంలో చాలా కష్టపడుతుంటారు. ఇదిలా ఉంటే త్రిష హీరోయిన్ గా నటించబోతున్న ఓ అప్ కమింగ్ మూవీలో తను రియాలిటిగా నటించాలంటూ డైరెక్టర్ కండిషన్ పెట్టారంట.


అందుకు త్రిష సైతం కమిట్ అయింది. అయితే త్రిషను ఏ సన్నివేశంలో రియాలిటిగా నటిస్తుందో తెలుసుకున్న చాలా మంది...ఆశ్ఛర్యపోతున్నారు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న దీనికి సంబంధించిన వివరాలను చూస్తే, కంగనా రనౌత్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ బాక్సాపీస్ ని షేక్ చేసిన సినిమా ‘క్వీన్’. 2014లో ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది.


ఈ మూవీకి కంగనా రనౌత్ జాతీయ ఉత్తమ నటి అవార్డు ని సైతం అందుకుంది. ఆ విజయాన్ని చూసిన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వెంటనే ఈ మూవీ రిమేక్ రైట్స్ ని చేజిక్కించుకుంది. తెలుగు రీమేక్ కోసం నయనతార, నిత్యా మీనన్,సమంత వంటి టాప్ హీరోయిన్స్ ని నిర్మాత త్యాగరాజన్ అప్రోచ్ అయ్యారు. అయితే సుధీర్ఘ చర్ఛల అనంతరం ఈ మూవీ ప్రస్తుతం పట్టాలెక్కనుంది.


ఈ సినిమాకు ప్రముఖ నటి రేవతి దర్శకత్వం వహించనున్నారు. కొన్ని సినివేశాల్లో కంగాన తాగుతూ ఉంటుంది. అలాంటి సన్నివేశాలు రిమేక్ ఫిల్మ్ ఇంకొంచెం ఎక్కువుగా ఉండనున్నాయి. అందుకే డైరెక్టర్ రేవతి, త్రిషని నిజంగానే సెట్స్ లోకి తాగి రావాల్సిందిగా చెప్పిందట. అప్పుడే సీన్స్ బాగా వస్తాయని వీరు మాట్లుకున్నట్టు కోలీవుడ్ లో టాక్స్ వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: