రెజీనా తో పాటు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ రాశీ ఖన్నాలు కెరియర్ పరంగా దూసుకు పోతూ ఉంటే రెజీనాకు మాత్రం ఇప్పటి వరకు సరైన బ్రేక్ పడక పోవడంతో ఆమె కెరియర్ అయోమయంలో పడిపోయింది. ఆమె సాయి ధరమ్ తేజ్ తో నటించిన రెండు సినిమాలు హిట్ అయినా సాయి ధరమ్ తేజ్ కు అవకాశాలు పెరిగాయి కానీ ఈమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. దీనితో ఇక లాభం లేదు అనుకుని కోలీవుడ్ లో అవకాశాలు కోసం ప్రయత్నిస్తోంది రెజీనా. 

ఈ మధ్య కాలంలో ఆమెకు అవకాశాలు రాకపోయినా టాలీవుడ్ మీడియాలో మాత్రం ఈమె పై ఎదో రకమైన గాసిప్పులు వస్తూనే ఉన్నాయి. ఈమధ్య ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రెజీనా తన బాయ్ ఫ్రెండ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూ చేసిన మీడియా ప్రతినిధి ఇప్పటికీ సాయి ధరమ్ తేజ్ తో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారా ? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను ప్రస్తుతం ఈ మెగా యంగ్ హీరోతో ఎటువంటి సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం లేదు అని అంటూ పరోక్షంగా కొన్ని సెటైర్లు వేసింది. 

తన సినిమా కెరియర్ లో తనను ఏ బాయ్ ఫ్రెండ్ పక్కన పడేయ లేకపోయాడని అయితే తనకు నచ్చక తానే అనేక మంది బాయ్ ఫ్రెండ్స్ ను పక్కన పడేసానని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె కామెంట్స్ చదివిన వారికి మాత్రం ఈ హాట్ హీరొయిన్ సాయి ధరమ్ తేజ్ ను సందీప్ కిషన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్స్ చేసిందా అని అనిపించడం సహజం. ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ తాను పక్కన పడేసిన మాజీ బాయ్ ఫ్రిండ్స్ తో ఇంకా తాను మాట్లాడుతూనే ఉన్నాను అనడం మరో ట్విస్ట్.  

మెగా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నా ఆమెకు గుర్తింపు మిగిలింది కాని అవకాశాలు రావడం లేదు అన్న ఉక్రోషంతో రెజీనా తన బాయ్ ఫ్రెండ్స్ ను టార్గెట్ చేస్తూ ఇలాంటి కామెంట్స్ చేసింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: