మంచు లక్ష్మీ నటించిన కొత్త సినిమా ‘గుండెల్లో గోదారి’. ఈ సినిమాను మంచు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై మంచు లక్ష్మీ స్వయంగా నిర్మిచడం విశేషం. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే తమిళ వెర్షన్ ను ఫిబ్రవరి 22న విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆది పినిశెట్టి, సందీప్ కిషన్, మంచు లక్ష్మీ, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ను 1986 లో జరిగిన గోదావరి వరదల నేపధ్యంలో తెరకెక్కించారు. కుమార్ నాగేందర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: