పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఏర్పడ్డ తల నొప్పులు తీరిపోయాయి అని భావిస్తున్న అల్లుఅర్జున్ కు పవన్ అభిమానుల సెగ సింగపూర్ లో కూడ గట్టిగా తగిలింది. ‘సైమా’ అవార్డ్స్ ఫంక్షన్ కు సింగపూర్ వచ్చిన అల్లుఅర్జున్ తాను నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకు సంబంధించి’ స్పెషల్ ఎప్రిసియేషన్ క్రిటిక్స్ అవార్డ్ ను అందుకుంటున్న సందర్భంలో ఊహించని విధంగా మళ్ళీ పవన్ అభిమానులచేత టార్గెట్ చేయబడ్డాడు.

బన్నీ ఈ స్పెషల్ అవార్డ్ ను ‘సైమా’ అవార్డ్స్ వేదిక పై తీసుకున్న తరువాత తన కృతజ్ఞతలు తెలియ చేయడానికి మైక్ అందుకుని మాట్లాడటం మొదలు పెట్టగానే కొందరు పవన్ వీరాభిమానులు ‘పవర్ స్టార్..  పవర్ స్టార్’ అంటూ గోలచేసారు. ఈఅనుకోని సంఘటనకు షాక్ అయిన అల్లుఅర్జున్ ఒక్క క్షణం తనమాటలు ఆపి వెంటనే తేరుకుని ‘గమ్మునుండవోయ్...మాట్లాడనీ' అంటూ పవన్ అభిమానుల స్పీడ్ కు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించాడు.

అయితే ఈ సంఘటన మళ్ళీ హాట్ టాపిక్ గా మారిపోయి వెబ్ మీడియాలో కొందరు అల్లుఅర్జున్ ను టార్గెట్ చేస్తూ మళ్ళీ కామెంట్స్ పెట్టే స్థితికి సింగపూర్ ‘సైమా’ అవార్డ్స్ వ్యవహారం దారి తీసింది. ‘సరైనోడు’ సక్సస్ మీట్ లో బన్నీ పవన్ అభిమానులతో ‘చెప్పను బ్రదర్’ అని కామెంట్స్ చేసినందుకు ఎంత రచ్చ జరిగిందో అదే స్థాయిలో మళ్ళీ బన్నీని టార్గెట్ చేస్తూ వెబ్ మీడియాలో కొందరు బన్నీ పై నెగిటివ్ కామెంట్స్ కొందరు పోస్ట్ చేస్తున్నారు.

‘ఒక మనసు’ ఆడియోఫంక్షన్ లో అల్లర్జున్ సుమారు పది నిముషాల సేపు తన ‘చెప్పను బ్రదర్’ కామెంట్స్ క్లారిటీ ఇచ్చినా ఇంకా పవన్ అభిమానులు దేశం కాని దేశంలో కూడ అల్లుఅర్జున్ ను వెంటాడటం వెనుక ఏమైనా మరో కోణం దాగి ఉందా అన్న విషయమై ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: