తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి.  పునాధిరాళ్లు చిత్రంతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి స్వయంకృషితో పైకి వచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం ఈయన కుటుంబం నుంచి అరడజను మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక చిరంజీవి హీరోగా మంచి ఫామ్ లో ఉండగా శంకర్ దాదా జిందాబాద్ చిత్రం తర్వాత రాజకీయ రంగంలోకి ప్రవేశించారు.  కానీ సినిమాలు వేరు..రాజకీయాలు వేరు అన్న విషయం తర్వాత గమనించారు..అప్పటికే పది సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు వెండితెరపై మళ్లీ ప్రత్యక్షం కావడానికి దాదాపు రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా సినిమాలపై కథలు విని ప్రజలకు మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రమైతే బాగుంటుందని నిర్ణయించి తమిళ సూపర్ హిట్ చిత్రం ‘కత్తి’ చిత్రాన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టు మలిచి తీస్తున్నారు.

ఈ చిత్రానాకి మాస్ డైరెక్టర్ వివివినాయక్ ఇక సంగీతం రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ..నిర్మాతగా చిరు తనయుడు రాంచరణ్ వ్యవహరించబోతున్నారు. అంతే కాదు ఈ చిత్రానికి సంబంధించి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. ఇప్పుడు రెండో షెడ్యూల్ కోసం హీరోయిన్ వేటలో ఉన్నారు చిత్ర యూనిట్. మెగాస్టార్ గా చరిత్ర సృష్టించిన చిరంజీవి సరసన నటించడానికి బోలెడు మంది హీరోయిన్ లు అప్పట్లో పోటీ పడేవాళ్ళు కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ ని చిరంజీవితో నటించను అని ఒక రకంగా అవమానించింది.

చిరంజీవి సీనియర్ హీరో అని భావించిందో ఏమో కానీ చిరు తో నటించే చాన్స్ వస్తే నటించను అని నోటితో చెప్పకుండా రెండున్నర కోట్లు ఇస్తే చేస్తా అని చెప్పి చిరంజీవి కి అలాగే ఆ చిత్ర బృందానికి పెద్ద షాకే ఇచ్చింది కాజల్ అగర్వాల్.  ఆ మద్య చిరంజీవి సరసన నయన తార, అనుష్క, త్రిష అని అనుకున్నప్పటికీ వారి బిజీ షెడ్యూల్ వల్ల నటించలేక పోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: