గత రెండు మూడు రోజులుగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సోషల్ మీడియాలో చేస్తున్న హడవిడిని చూసి దేవిశ్రీ ఎదో ఒక సంచలన నిర్ణయం చెప్పబోతున్నాడు అని భావించారు అంతా. కొద్ది కాలం క్రితం దేవిశ్రీ ప్రసాద్ దిల్ రాజ్ నిర్మాణ సంస్థలో సుకుమార్ దర్శకత్వంలో హీరోగా నటిస్తాడు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో దేవిశ్రీ తన హీరో ఎంట్రీ గురించి ఏమైనా ఫ్లాష్ న్యూస్ చెపుతాడేమో అని భావించారు అంతా.

అయితే అందరి ఊహలకు షాక్ ఇస్తూ దేవిశ్రీ ప్రసాద్ ఒక కొత్త విషయాన్ని బయట పెట్టాడు.  త్వరలో తాను జీ తెలుగులో మ్యూజికల్ ప్రోగ్రామ్ చెయ్యబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు  ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని దేవిశ్రీ తెలిపాడు. 

అంతేకాదు తన పేరును తన పేరును తన అభిమానులు అంతా షార్ట్ కట్‌లో డి.ఎస్.పి అని పిలుస్తారని అయితే డానికి అర్ధం  డి అంటే డాన్సర్, ఎస్ అంటే సింగర్, పి అంటే పెర్ఫార్మర్ అంటూ తన పేరుకు మరో కొత్త అర్ధాన్ని బయట పెట్టాడు. 

అయితే ఈమధ్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో పస తగ్గిపోతోంది అన్న కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో ఎందుకైనా మంచిదని దేవిశ్రీ ముందు చూపుతో తన వెండితెర ప్రయాణంతో పాటు బుల్లితెర ప్రయాణాన్ని కూడ కొనసాగిస్తాడా అని సందేహాలు రావడం సహజం. అయితే దేవిశ్రీకి యూత్ లో ఉన్న క్రేజ్ రీత్యా ఈ కార్యక్రమానికి మంచి రేటింగ్స్ వచ్చే అవకాశం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: