ఈరోజు ఉదయం నుంచి మన తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్ అన్ని ‘కబాలి’ మ్యానియా’ తో షేక్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో  ఏసినిమాకు రానంత క్రేజ్ ఈ సినిమాకు ఏర్పడ్డటం టాలీవుడ్ విశ్లేషకులను కుడా ఆశ్చర్య పరుస్తోంది. ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్ వద్ద ఉన్న భారీ జననాన్ని చూస్తూ ఉంటే ‘కబాలి’ తొలిరోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఎవరికీ  అంచనాలకు  కూడ అందటం లేదు అని అంటున్నారు. 

ఈ సినిమా టికెట్క కోసం ప్రభుత్వ యంత్రాంగాలే తలక్రిందులవుతూ మంత్రుల దగ్గరినుంచి రికమండేషన్లూ వస్తున్నాయి అంటే ఈ సినిమా మ్యానియా ఏరేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది. ఇటువంటి హంగామా జరుగుతున్న ‘కబాలి’ సినిమాను మొదటిరోజు మొదటి షో చూడలేకపోవడంతో రాజమౌళి బాధ పడుతూ ట్విట్ పెట్టాడు.

తాను ఈ సినిమా తొలిరోజు తొలి ఆట చూడలేకపోయానంటూ బాధపడుతున్నాడు రాజమౌళి. ఈ విష‌యాన్ని జ‌క్క‌న్న త‌న ట్విట్ట‌ర్ ద్వారా త‌న అభిమానుల‌కు తెలియచేసాడు. ‘బాహుబ‌లి-2’ షూటింగ్ బిజీబిజీగా ఉండ‌డంతో తాను ‘క‌బాలి’ ని చూడ‌లేక‌పోయాన‌ని అంటూ తాను కూడ ధియేటర్లలో ఉంటే ‘తలైవా మ్యానియాతో అందరితోపాటు తాను కూడ షేక్ అయిపోయే వాడిని అంటూ ట్విట్ చేసాడు రాజమౌళి. 

ఇది ఇలా ఉండగా ఈసినిమాకు డివైడ్ టాక్ వచ్చినా ఆ టాక్ ఈసినిమా మొదటి వారం కలక్షన్స్ పై ఎటువంటి ప్రభావం చూపెట్టే అవకాశం లేదు అని అంటున్నారు. దీనికి కారణం మన ఇరు రాష్ట్రాలలోను ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లు మరో నాలుగు రోజుల వరకు పూర్తిగా అయిపోవడంతో ‘కబాలి’ ఏ స్థాయిలో హిట్ అయింది అనే అసలు స్వరూపం కేవలం వచ్చే వారం తరువాత మాత్రమే తెలుస్తుందని విశ్లేషకులు ఒక అంచనాకు వస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: