పవన్కల్యాణ్ కొత్త సినిమా పై వస్తున్న వార్తలకు అధికారికం ఫుల్స్టాప్ పెట్టడానికి నిర్మాత శరత్ మరార్ రంగంలోకి దిగి ఈరోజు ఒక ట్విట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ఒక వైపు తెలుగు రాష్ట్రాలలోని పవన్ వీరాభిమానులు కూడా "కబాలి" మ్యానియా ఆసక్తిగా పరిసీలుస్తూ ఉంటే ఊహించని తలంపుగా శరత్ మరార్ పెట్టిన ట్విట్ పవన్ అభిమానులకు మంచి జోష్ ను ఇచ్చింది.
పవన్ డైరెక్టర్ డాలీతో మూవీ చేయడంలేదని ఈ సినిమాను కూడా పవన్ శాశ్వతంగా అటక ఎక్కించాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో అయోమయంలోకి వెళ్ళిపోయిన పవన్ అభిమానులకు జోష్ ను ఇవ్వడానికి శరత్ మరార్ ఈ ట్విట్ చేసాడు అనుకోవాలి. డాలీ దర్శకత్వంలో పవన్ నటించ బోయే సినిమా ఆగష్టు నుంచి సెట్స్పైకి వెళ్తుందని అందులో హీరోయిన్గా శృతిహాసన్ను ఎంపిక అయిందని అన్న విషయాన్ని తెలియచేస్తూ ట్విట్ చేసాడు శరత్ మరార్.
అంతేకాదు ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపాడు శరత్ మరార్. దీనితో పవన్ లేటెస్ట్ మూవీ పై వస్తున్న రూమర్లకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే అనుకోవాలి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్న ఈ సినిమా ఇప్పటి కైనా పట్టాలు ఎక్కి స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసుకోగలిగితే అది పవన్ అభిమానులకు ఒక పండుగ అనుకోవాలి.
అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై, రిలీజ్ అయ్యేసరికి వచ్చే ఏడాది సమ్మర్ కావచ్చునని పవన్ సన్నిహిత వర్గాలు చెపుతున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తూ ఉంటే పవన్ త్రివిక్రమ్ ల మూవీ వచ్చే సమ్మర్ లో మాత్రమే లాంఛ్ కావచ్చునని ఫిలింనగర్ వర్గాల సమాచారం..