అల్లు అరవింద్ వ్యూహాత్మక ఎత్తుగడలను అర్ధం చేసుకోవడం అంత సులువైన పని కాదు. అదేవిధంగా తాను నిర్మించే సినిమాల విషయంలో మితిమీరిన ఖర్చులు చేయకుండా సినిమా బడ్జెట్ ను ఎప్పుడూ కంట్రోల్ లో పెట్టుకుంటాడు అల్లు అరవింద్. అయితే అల్లు శిరీష్ ఆశలకు తన తండ్రి సెంటిమెంట్ ఒకటి అడ్డుగా మారడం శిరీష్ కు షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఆసక్తికరమైన ఈన్యూస్  వివరాలలోకి వెళితే అల్లుఅరవింద్ తన చిన్న కొడుకు శిరీష్ నటిస్తున్న ‘శ్రీరస్తు శుభమస్తు’ పాటలను ఆడియో ఫంక్షన్ చేసి విడుదల చేయకుండా ఎటువంటి హడావిడి లేకుండా విడుదల చేయాలని నిశ్చయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే  ఇలాంటి నిర్ణయం అరవింద్ తీసుకోవడం వెనుక ఒక సెంటిమెంట్ ఉంది అని అంటున్నారు.

ఈ సంవత్సరపు బ్లాక్ బస్టర్ హిట్ గా రికార్డులను క్రియేట్ చేసిన అల్లుఅర్జున్ ‘సరైనోడు’ సినిమాను కూడ ఎటువంటి ఆడియో ఫంక్షన్ నిర్వహించకుండా విడుదల చేసినా ‘సరైనోడు’ సూపర్ హిట్ అయిన నేపధ్యంలో ఇప్పుడు అదే సెంటిమెంట్ ను అల్లు శిరీష్ సినిమాకు కూడ ఉపయోగిస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మరికొందరైతే అల్లు శిరీష్ సినిమా పై ఆ డియో ఫంక్షన్ చేసి దాదాపు 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టే దానికన్నా పొదుపు చర్యలు చేపట్టడం మంచిది అని అరవింద్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ సెటైర్లు కూడ పడుతున్నాయి.

అయితే శిరీష్ మాత్రం తన తో ఈ సినిమాలో తనతో జత కట్టిన లావణ్యా త్రిపాఠీతో మెగా అభిమానుల ఎదుట ఆడియో ఫంక్షన్ లో హడావిడి చేద్దామనుకుంటే తన తండ్రికి ఈ సెంటిమెంట్ గుర్తుకు వచ్చింది ఏమిటి అని మధన పడుతున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: