క్రేజి హీరోయిన్ సాయి పల్లవి చేసినవి కేవలంరెండే రెండు సినిమాలు అయితే ఆరెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం తో ప్రస్తుతం ఈమె పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగుతోంది. స్టార్ హీరోలు,స్టార్ డైరెక్టర్లు కూడా ఈ క్రేజీ బ్యూటీ డేట్స్ కోసం చూస్తున్నారు అంటే ఈమె క్రేజ్ యే స్థాయి లో ఉందో అర్ధం అవుతుంది. ప్రేమమ్ లో మలార్ గా అందర్నీ మాయ చేసింది ఈ బ్యూటీ.
ఈ సినిమాతో దక్షిణాదిన పాపులర్ హీరోయిన్ గా మారి పోయింది సాయిపల్లవి. అయితే ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ వింత ప్రవర్తన పై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం ఈమె బడా సినివమాలకు నో చెప్పి క్రేజ్ పెంచుకుంటోంది. బయటకు వస్తున్న వార్తల ప్రకారం ఇప్పటికే రెండు భారీ సినిమాలకు సాయిపల్లవి నో చెప్పేసింది అని టాక్ .ఇందులో ఒకటి మణిరత్నం సినిమా అయితే మరొకటి కోలీవుడ్ టాప్ హీరో అజిత్ సినిమా.
ఆశ్చర్యం ఏమిటంటే మణిరత్నం సినిమాలో నటించడానికి ఏ హీరోయిన్ అయినా కలలు కనే నేపధ్యంలో ఈమె మాత్రం మణి రత్నం సినిమాలో వచ్చిన అవకాశాన్నివదిలి వేయడం మీడియా కు హాట్ టాపిక్ గా మారింది. హీరో కార్తితో మణి రత్నం చేస్తున్న కాట్రు వెలియాదై సినిమాలో ముందు సాయిపల్లవినే హీరోయిన్ గా తీసుకున్నారట . కానీ ఆ సినిమాలో లిప్ లాక్ సీన్స్, హాట్ సీన్స్ ఉన్నాయని నో చెప్పి ఏకం గా మణిరత్నంకే సాయి పల్లవి షాక్ ఇచ్చిందని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. దీనితో మణిరత్నం ఈమె స్థానంలోకి బాలీవుడ్ బ్యూటీ అదితిరావ్ హైద్రీని తీసుకున్నాడు.
ఇక ఇది ఇలా ఉండగా కోలీవుడ్ టాప్ హీరో అజిత్ సినిమాను యంగహీరో వరుణ్ తేజ్ కోసం వదులుకోవడం కుడా షాకింగ్ న్యూస్ గా మారింది. వరుణ్ తేజ్ తో శేఖర్ కమ్ముల సినిమాకు సాయిపల్లవి ఓకే చెప్పడంతో ఒకేసారి రెండు సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక అజిత్ సినిమా వదిలేసింది ఈ మాలీవుడ్ బ్యూటీ. దీనితో రెండు భారీ సినిమాలను కెరీర్ మొదట్లోనే వదిలేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది సాయిపల్లవి.