తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ రేంజ్ ఎంటో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. సినిమా నటుడుగానే కాకుండా రాజకీయ వేత్తగా ప్రజల అభిమానం సాధించిన పవన్ మాటల మాంత్రికుడు తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది ’ చిత్రం తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించాడు. అయితే ఈ చిత్రంపై మొదటి నుంచి విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి. ఇక ఉగాది పండుగ రోజు థియేటర్లలో సందడి చేశాడు సర్ధార్ గబ్బర్ సింగ్. కానీ అభిమానుల అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. సినిమా మొదటి భాగం ఓకే అనిపించినా రెండో భాగం చాలా చెత్తగా ఉండటంతో సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.  ఆ తర్వాత పవన్ సినిమాలు చేయనని ఓ ఇంటర్వ్యూలో చెప్పినటప్పటికీ అభిమానులు బాగా వత్తిడి చేయడంతో మరో సినిమాకు కమిట్ అయ్యాడు.

గతంలో పవన్ కెరీర్ లో బెస్ట్ సినిమా అయిన ఖుషి చిత్రం సీక్వెల్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ చిత్ర దర్శకుడు ఎస్.జె. సూర్య ముందుకు రావడం సినిమా పూజా కార్యక్రమాలకు కూడా చేయడం జరిగింది. అంతలో ఏమైందో కానీ ఈ సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడు...ఆయన ప్లేస్ లో గోపాల గోపాల దర్శకుడు డాలీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ సినిమా డాలీతో అని అతి త్వరలో షూటింగ్ మొదలు కాబోతుందని పవన్ స్నేహితుడు, నిర్మాత శరత్ మారర్ అంటున్నారు. . శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుపుతూ పనిలో పనిగా ఆగస్టు లో రెగ్యులర్ షూటింగ్ అని చెబుతున్నారు.

సినిమా ఎలాగూ ఆలస్యం అవుతోంది కదా ! అందుకే ఇలా చేస్తున్నాడో ఏమో ! అని అంటునారు . ఇక పవన్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం ఫెయిల్యూర్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు బాగానే సాధించింది. ఇప్పుడు పవన్ నటించే చిత్రంపై అభిమానులు మరిన్ని ఆశలు పెట్టుకుంటారు కనుకనే  పవన్ కెరీర్ లో మరో హిట్ చిత్రం కోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: