అవక అవక చిరంజీవి 150 సినిమా మొదలు అయితే ఈ మధ్య వచ్చిన రూమర్ లు చిరంజీవి ఫాన్స్ ని భయపెడుతున్నాయి. పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు నచ్చక చిరంజీవి - రామ్ చరణ్ కలిసి తీర్మానించి మరీ సినిమా సెకండ్ షెడ్యూల్ ఆపేశారు అనే వార్తలు మెగా ఫాన్స్ ని కలవర పరిచాయి. పరుచూరి బ్రదర్స్ బదులు సాయి మాథవ్ బుర్రా తో కొత్త్త డైలాగులు రాయించిన తరవాతనే చిరు రంగంలోకి దిగుతాను అని భీష్మించుకు కూర్చున్నాడు అని చెప్పాయి ఆ వార్తలు. కానీ ఇందులో ఎంతవరకూ నిజం ఉంది అనేది చూద్దాం.

 

నిజానికి చిరు 150 చిత్రం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలు కూడా అయిపొయింది. బుధవారమే రెండో షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలెట్టేసారు. ఈ విషయాన్ని రత్న వేలు స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఈ సినిమా షూటింగ్ నుంచి సెలవు తీసుకుని మరీ కబాలి చూడడం కోసం వెళుతున్నా అంటూ చెప్పాడు ఆయన. సో దీని బట్టి చూస్తే ఈ సినిమాకి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ హీరోయిన్ విషయం లో మాత్రం యూనిట్ ఇంకా ఎలాంట్ కన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు.

 

 రామ్ చరణ్ స్వయంగా కాజల్ తో మాట్లాడి ఒప్పించే పనిలో ఉన్నాడట, ఆమె మాత్రం పారితోషికం ఆకాశానికి ఎత్తేసి అడుగుతోంది. ప్లాపుల్లో ఉన్నా కూడా ఆమె ఇలా అందనంత పారితోషికం అడగడం చిరు కీ రామ్ చరణ్ కీ నచ్చట్లేదు. మరొక పక్క చరణ్ తో ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసిన కాజల్ తో చిరు రోమాన్స్ అంటే అంతగా బాగోదు అని వినాయక్ సలహా ఇస్తున్నాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: