మంచి అలవాట్లకు సమయ పాలనకు సమర్థతకు చిరునామాగా ఉండే మోహన్ బాబు పిల్లలు కూడ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే అటువంటి కుటుంబం నుంచి వచ్చిన మంచు విష్ణు తాను ఒక బలహీనతకు బానిస అయ్యాను అంటూ బహిరంగంగా చెప్పటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

నేడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న ఉగ్రవాదం కంటే ఒక మొబైల్ గేమ్ ప్రస్తుతం యువతరాన్ని పిచ్చి వాళ్ళుగా మార్చి వేస్తోంది. ప్రస్తుతం అమెరికాతో సహా అనేక దేశాల యువతరాన్ని విపరీతంగా ఆకర్షిస్తున్న  ‘పోక్ మాన్ గో’ అనే గేమ్ తో అమెరికాలోని యువత ఈ గేమ్ ఎడిక్ట్ అయిపోయి మానసిక రోజులుగా మారిపోతున్నారు అని వార్తలు వస్తున్నాయి.

ఈ గేమ్ ఎడిక్షన్లో కొంతమంది విచిత్రమైన పనులు చేస్తుంటే ఈ గేమ్  ముసుగులో కొన్ని క్రయిమ్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ గేమ్ ఎడిక్షన్ ను మన టాలీవుడ్ సెలెబ్రెటీలకు కూడ పాకింది. ఈమాయలో మంచు విష్ణు కూడ పడిపోయాడట. ‘ఏదో పట్టినట్లు.. ఈరోజు నేను బెంగుళూరు ఎయిర్ పోర్టులో నా పోక్ మాన్ గేమ్ కోసం తిరుగుతూనే ఉన్నాను. గేమ్ మాత్రం అదిరిపోయింది. నాలాగే ఎడిక్ట్ అయిపోయినోళ్లు ఇంకా ఎంతమంది ఉన్నారు’? అంటూ ట్వీటేశాడు మంచు విష్ణు. 
అయితే ఈ గేమ్ ఇంకా ఇండియాలో అఫీషియల్ గా రాలేదు. ఈమధ్యనే అమెరికా వెళ్ళి వచ్చిన మంచు విష్ణు అక్కడ ఈ గేమ్ ను డౌన్ లోడ్ చేసుకున్నాడట.

ప్రస్తుతం ఈ గేమ్ మత్తులో రోజులు గడుపుతున్నాడు మంచు విష్ణు చాలామంది హీరోయిన్లు కేవలం ‘పోక్ మాన్’ పై పోస్టులు పెడుతుంటే ఏకంగా మంచు విష్ణు ఈ గేమ్ కు ఎడిక్ట్ అయ్యానంటూ ఒప్పుకోవడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. త్వరలోనే ఐఫోన్ వర్షన్ ఇండియాలో అఫీషియల్ గా ఈ గేమ్ రిలీజవుతుండటంతో ఇండియాను కూడ ఈ గేమ్ అతలా కుతలం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: