సమ్మర్ రేస్ కు వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘బ్రహ్మోత్సవం’  భయంకరమైన ఫ్లాప్ లు గా మారడంతో పవన్ మహేష్ లకు తాము లేటెస్ట్ గా నటిస్తున్న సినిమాలు తమ కెరియర్ కు ఎంతో కీలకంగా మారాయి.  దీనితో టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతున్న వారిద్దరూ మళ్ళీ వారి స్పీడ్  పెంచబోతున్నారు. 

అయితే అనుకోకుండా ఈ ఇద్దరు  ఒకే నెలను నమ్ముకోవడం ఆశ్చర్యంగా మారింది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేయబోయే సినిమా జులై 29న సెట్స్ మీదికి వెళ్ళడం ఖాయం అయింది. చెన్నై, ముంబయి, గుజరాత్, పుణె, హైదరాబాద్ ల్లో షెడ్యూళ్లు ప్లాన్ చేస్తూ  నిర్విరామంగా షూటింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎస్.జె.సూర్య విలన్ గా నటించబోతున్న ఈ సినిమాను 90 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు.  వచ్చే ఏడాది  సమ్మర్ రేస్ ను టార్గెట్ చేసే విధంగా ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కూడా తన బద్ధకాన్ని వదిలించుకుని డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ తీస్తున్న సినిమాను ఆగష్టు 6నుండి షూటింగ్ మొదలు పెట్టడానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ చేసాడు. 

శ్రుతి హాసన్ హీరోయిన్ కన్ఫమ్ అయిన ఈ సినిమాను కూడ ఎక్కడా బ్రేక్ లేకుండా తీసి వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ ను టార్గెట్ చేస్తూ విడుదల చేయడానికి పవన్ కూడ రెడీ అవుతున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఏడాది సమ్మర్ తమకు కలిసి రాకపోయినా అదే సమ్మర్ ను నమ్ముకుని మళ్ళి పోటీ పడుతూ ఉండటం లేటెస్ట్ ట్విస్ట్. ఈ టాప్ హీరోలు ఇద్దరికీ తమ కేరియర్ కు సంబంధించి ఈ సినిమాల విజయం కీలకం కావడంతో పవన్ మహేష్ లు ఈ సినిమాల గురించి చాలా  కష్టపడతారు అనడంలో ఎటువంటి సందేహంలేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: