ఆమె పేరు మన్నార చోప్రా, అందరికీ ప్రియాంకా చోప్రా అంటే గుర్తు పడతారు ఏమో. ఇప్పటి వరకూ బ్రేక్ అనేది రాలేని ఈమె హిందీ - తమిళ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఆరంగేట్రం అసలు తెలుగు సినిమాలతోనే చేసిన మన్నార మళ్ళీ ఇప్పుడు కొన్ని తెలుగు సినిమాలు చేస్తోంది. ఒకే సారి రెండు మూడు సినిమాల ఆఫర్లు రావడం తో అన్నింటా తానే అయ్యి షూటింగ్ లలో పాల్గొంటోంది. వాటిల్లో ఒకటి సునీల్ సినిమా జక్కన్న కావడం విశేషం.

 

తెలుగు సినిమా ప్రేక్షకుల గురించి ఆమె ఏమని చెప్పిందో చూడండి " తెలుగు సినిమా ప్రేక్షకులు మ మేకర్ లూ చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. ప్రేక్షకులు మరీ ముఖ్యంగా ఫ్రెండ్లీ గా ఉంటారు. సినిమా బాగుంటే చాలు సూపర్ హిట్ చేసి పారేస్తారు. తెలుగు లో అందుకే ఎక్కువగా నటిస్తున్నా. సునీల్ విషయం లో నాకు అతని కామెడీ టైమింగ్ బాగా నచ్చింది అతనితో స్పెండ్ చేసిన ఇట్టే గడిచిపోతుంది. జక్కన్న సినిమాలో అతని కామేడీ టైమింగ్ తో నేను పొటీ పడ్డాను కానీ ఓడిపోయాను." అని చెబుతోంది మన్నర.

 

సప్తగిరి - సునీల్ ఇద్దరి మధ్యనా వచ్చే సీన్లు చాలా ఫన్నీగా ఉంటాయి అనీ ఈ సీన్ లే సినిమాకి హై లైట్ అని మన్నర తన ప్రమోషన్ లలో ఊదరగోడుతోంది. సునీల్ సినిమా తరవాత తిక్క సినిమాలో కూడా సాయి ధరం తేజ తో రోమాన్స్ చేసింది ఈమె. రెండు సినిమాలూ కేవలం రెండు వారాల గ్యాప్ లో విడుదల అవ్వబోతున్నాయి. ఇలా వెంట వెంటనే సినిమాలు రావడం పట్ల మీకు ఎలా ఉంది అంటే ఇది చాలా రేర్ గా జరిగే వ్యవహారం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటోంది ఆమె. పూరీ జగన్నాథ్ రోగ్ సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. మూడు సినిమాలూ ఆమె కి మంచి బ్రేక్ ఇచ్చేవే. సునీల్ స్వయంగా రైటర్ లని తన పర్యవేక్షణలో పెట్టుకుని మరీ రాయించిన సినిమా జక్కన్న అయితే ఫుల్ ఫార్మ్ లో ఉన్న సాయి తిక్క తో మళ్ళీ హిట్ కొడుతున్నాడు అంటున్నారు. ఇక పూరీ జగన్నాథ్ హీరోయిన్ లకి ఇచ్చే బ్రేక్ ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: