సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి మూవీ ప్రస్తుతం థియోటర్స్ లో హల్ చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ రజనీకాంత్ అభిమానులకే కాకుండా సాధరణ ప్రేక్షకులను సైతం కొంత మేర నిరాశపరిచిందని అంటున్నారు. ఎందుకంటే అందరూ ఊహించినంతగా ఈ సినిమా వేగవంతంగా ముందుకు జరగలేదని అంటున్నారు.


కథ బలంగా ఉండటంతో, దానికి తగ్గట్టుగా సీన్స్ స్పీడుగా లేకపోవటంతో ప్రేక్షకులు ఈ సినిమాకి కనెక్ట్ కాలేకపోయారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ నుండి ఫీడ్ బ్యాక్ ని తీసుకున్న దర్శకుడు, కథ స్లోగా ఉందనే నిర్ణయానికి వచ్చారు. దీంతో దర్శకుడు పా రంజిత్ కబాలి సినిమాలో దాదాపు 12 నిమిషాల మేర సినిమా నిడివి తగ్గించారు.


ఈ విధంగా నిడివి తగ్గించిన సినిమా సోమవారం నుండి ప్రదర్శణ జరుపుకునే షోలతో అందుబాటులోకి రానుంది. ప్రేక్షకుల తీర్పును రజనీకాంత్ కి చెప్పిన దర్శకుడుకి, రజనీ నుండి ఎటువంటి సమాధానం రాలేదంట. అయితే తను చేస్తున్న 12 నిమిషాల కుదింపుని మాత్రం రజనీకి చెప్పుకుండా చిత్ర టీం నిర్ణయం తీసుకుంది.


ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్, దర్శకుడిపై కొంత నిరాశని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక కళైపులి ఎస్.థాను నిర్మించిన ఈ సినిమా ప్రపంప వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ ని రాబట్టగలుగుతుంది. కబాలి కలెక్షన్స్ కి ఇండియన్ సినిమా రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయినట్టే అని ఇప్పటికే ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: