యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ జనతగ్యారేజ్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీని ఆగష్టు నాటికి రిలీజ్ చేయాల్సి ఉండగా, అనుకోని విధంగా రిలీజ్ ని వాయిదా వేసుకున్నాయి. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ ని క్వాలిటిగా రెడీ చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని విధాలుగా రెడీ అయింది.


ఇదిలా ఉంటే జనతా గ్యారేజ్ విషయంలో ఎన్టీఆర్ తీసుకున్న జాగ్రత్తల కారణంగా ఈ మూవీ బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధించటం గ్యారెంటీ అని అంటున్నారు. అందుకే జనతా గ్యారేజ్ మూవీ ఆడియో ఫంక్షన్  విషయంలో అభిమానులకి జూనియర్ సర్ ప్రైజ్ ని ఇవ్వాలని భావించాడంట. అందులోని భాగంగానే ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ని మూడు ప్రధాన సెంటర్లో నిర్వహిస్తున్నారు.


ప్రధానంగా హైదరాబాద్ లో  ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ని చేస్తుండగా, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో ఈ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ని పెద్ద పెద్ద ఆడిటోరియంలలో ప్రత్యక్ష ప్రసారాలను ఇవ్వనున్నారని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న యంగ్ టైగర్ అభిమానులు...తెగ సంతోషపడుతున్నారు.


జూనియర్ ఎన్టీఆర్ ఇది అభిమానులకి ఇచ్చిన సర్ ప్రైజ్ అని వారు అంటున్నారు. మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం పై చిత్రయూనిట్ లోనూ పుల్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డం, డ్రెస్సింగ్ లతో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: