వరస విజయాలతో దూసుకుపోతున్న నాని సరికొత్త ఎత్తుగడ రామ్ చరణ్ కు ఆశ్చర్యం కలిగించడమే కాకుండా మరో విధంగా టార్చర్ పెడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో స్టార్ హీరోల స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టించిన నాని ఆ తర్వాత ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తో లేటెస్టుగా ‘జెంటిల్‌మన్’ తో హిట్లు కొట్టి టాప్ యంగ్ హీరోలను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. 

లేటెస్ట్ గా నాని ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చడీచప్పుడు లేకుండా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో చాల స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను మొదలుపెట్టిన మూడు నెలల్లోనే పూర్తి చేసి నాని రిలీజ్‌ కు ప్లాన్ చేస్తుండటం అందరికీ షాక్ ఇస్తోంది. ఈసినిమాను సెప్టెంబరు 17నే రిలీజ్ చేసేస్తారని టాక్. 

ఈసినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ఒక సెంటిమెంట్ నానీని ప్రభావితం చేస్తోంది అని వార్తలు వస్తున్నాయి. నానీ నటించిన ‘అష్టాచమ్మా’ ‘పిల్లజమిందార్’ మొదలుకుని గత సంవత్సరం విడుదలై సూపర్ హిట్ సాధించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమాల వరకు అన్నీ సెప్టెంబర్ లో విడుదల కావడంతో ఆ సెంటిమెంట్ తనకు బాగా కలిసి వస్తుందని నాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.

అయితే ఇప్పుడు నానీ తీసుకున్న నిర్ణయం చరణ్ కు టెన్షన్ గా మారింది అని అంటున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఏ యంగ్ హీరోల సినిమాలతోను పోటీ లేకుండా దసరా పండుగను తన ‘ధృవ’ క్యాష్ చేసుకుందామని చరణ్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చరణ్ సినిమాకు పోటీగా కళ్యాణ్ రామ్ హీరో రామ్ ల సినిమాలు కార్నర్ చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు లేటెస్ట్ గా నానీ కూడ దసరా రేసును టార్గెట్ చేస్తూ పోటీకి రెడీ అవుతూ ఉండటంతో ముగ్గురు యంగ్ హీరోల మధ్య తాను కార్నర్ ఐపోతానేమో అన్న భయం చరణ్ ను వెంటాడుతోంది అని టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: