తెలుగు ఇండస్ట్రీలో హృదయకాలేయం లాంటి పేరడీ కామెడీ చిత్రంతో వచ్చిన  సంపూర్నేష్ బాబు అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. హీరోగా హృదయకాలేయం తర్వాత సింగం 123 లాంటి చిత్రంలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీగా కనిపిస్తూ ప్రతి ఒక్కరినీ నవ్విస్తున్న సంపూ తాజాగా సీనియర్ హీరోలపై కామెంట్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇక తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 22 న విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా డివైట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమాపై సంపూ సెటైర్ వేశాడు.

ఒక్క రజనీ సినిమానే కాకుండా పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు లపై కూడా కామెంట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.  ఈ సంవత్సరం  . పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ , మహేష్ బ్రహ్మోత్సవం చిత్రాలతో పాటు కబాలి కూడా ఫ్లాప్ కావడంతో ''ఈ 2016 కి ఏమైంది ఓ పక్క పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ , మహేష్ బ్రహ్మోత్సవం ఇప్పుడు రజని కబాలి కూడా నోరు మెదపలేదు..! ఈ నిర్లక్ష్య ధోరణి కి కొబ్బరిమట్ట పాడాలి చరమగీతం'' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ కామెంట్స్ తో ఆయా హీరోల అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది.

నిన్నగాక మొన్న వచ్చిన చిన్నపాటి కమెడియన్ అంత పెద్ద హీరోలను విమర్శించడం పైగా తన సినిమాతో పోల్చి వారిని అవమానించడంపై కోపంగా ఉన్నారు. ఇక సినిమాలు అన్న తర్వాత హిట్, ఫెయిల్యూర్ అనేవి ఉంటాయి అంత మాత్రాన ఇలా విమర్శించడం సబబు కాదని ఫ్యాన్స్ అంటున్నారు. సంపూ స్థాయి ఎంత ? రజనీ , పవన్ , మహేష్ లను కామెంట్ చేసేంత దమ్ముందా వీడికి ? అంటూ సంపూ పై మండిపడుతున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: