టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అనుష్కకి, ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదటిసారిగా అవకాశం ఇచ్చిన హీరో నాగార్జున. తరువాత నాగార్జున నటించిన మరికొన్ని మూవీల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే తన సొంత ప్రతిభతో తెలుగు ప్రేక్షకుల గుర్తింపుని సైతం అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క కి నాగార్జున షాక్ ఇచ్చాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఇప్పుడు ముదురు హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిపోతున్నారు. హీరోయిన్ గా అవకాశాలని కోల్పోయిన తరువాత వీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవతారం ఎత్తుతున్నారు. ఆ విధంగా ఒకప్పుటి హీరోయిన్ టబు, ఇప్పుడు టాలీవుడ్ వైపు చూస్తుంది. ఇందుకు టబు స్నేహితుడైన నాగార్జున తన సహాకారాన్ని అందిస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే టబు సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తుందనే చెప్పాలి. ఇక అనుష్క ప్రస్తుతం పిల్ల జమిందార్ ఫెమ్ ‘అశోక్’ దర్శకత్వంలో రానున్న హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ‘భాగమతి’ లో నటిస్తుంది. ఈ మూవీలో టబు, అనుష్క తల్లిగా కనిపిస్తారని అంటున్నారు.  ఈ అవకాశాన్ని స్వయంగా నాగార్జునే టబుకి చూపించాడని అంటున్నారు.

అనుష్కకి సైతం టబుని పరిచయం చేసి...ఇద్దరూ కలిసి ట్రావెల్ చేయాలని చెప్పాడంట. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క నాగార్జున మాత్రమే టబుకి మంచి స్నేహితుడు. ఈ విషయం అనుష్కకి లేటుగా తెలియటంతో కొద్దిగా షాక్ అయిందని అంటున్నారు. ఇక భాగమతి మూవీకి విశేషాలు త్వరలోనే బయటకు రానున్నాయని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: