తెలుగులో ఉన్న మాస్ దర్శకుల్లో చేసిన మూడు సినిమాలతోనే ఓ మార్క్ వేసుకున్న సంపత్ నంది. ఓ హీరో నమ్మి సినిమా ఇచ్చాడంటే అతని రేంజ్ ఏమాత్రం తగ్గించకుండా సినిమాలు తీస్తాడని రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం సంపత్ నంది గోపిచంద్ హీరోగా ఓ సినిమా కమిట్ అయ్యారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవనుంది.


ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హాన్సిక, కేథరిన్ ను సెలెక్ట్ చేశారు దర్శక నిర్మాతలు. మాస్ హీరోల స్టామినాకు సరితూగే కథ కథనాలతో సంపత్ నంది తీసే సినిమాలు ఆడియెన్స్ కు భలే కనెక్ట్ అవుతాయి. అంతేకాదు రాబోతున్న గోపిచంద్ సినిమాను కూడా అదే రేంజ్ మాస్ మసాలా ఫీస్ట్ గా చేస్తున్నారట. సో ఈ సినిమా గోపిచంద్ అభిమానులకే కాదు మాస్ ప్రేక్షకులకు ఓ పండుగలా ఉంటుందని చెప్పొచ్చు.  


రచ్చ తర్వాత రెండేళ్లు ఆగి సర్దార్ గబ్బర్ సింగ్ కు కొద్దిరోజులు పనిచేసి చివరకు బెంగాల్ టైగర్ తో వచ్చిన సంపత్ నంది ఆ సినిమాతో తన మీద ఉన్న హోప్స్ ఏమాత్రం తగ్గనివ్వకుండా సినిమా రిజల్ట్ అందుకున్నాడు. రవితేజకు కూడా కిక్-2 ఫ్లాప్ తర్వాత బెంగాల్ టైగర్ రిజల్ట్ కొంత రిలీఫ్ ఇచ్చింది. ప్రస్తుతం కెరియర్లో హిట్ కోసం తహతహలాడుతున్న గోపిచంద్ సంపత్ తో చేస్తున్న సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.


ఇప్పటికే చేస్తున్న ఆక్సీజన్ రిలీజ్ కు రెడీ అవుతుంది. జ్యోతికృష్ణ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాను సూర్య మూవీస్ బ్యానర్లో ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. మరి ఆక్సీజన్ ఎలా ఉన్నా సంపత్ సినిమా మీద మాత్రం మంచి గురి పెట్టుకుని ఉన్నాడు గోపిచంద్. అనుకున్నట్టుగా సినిమా అవుట్ పుట్ వస్తుందా రాదా అన్నది సినిమా వస్తేనే గాని తెలుస్తుంది. శ్రీ బాలాజి మూవీస్ బ్యానర్లో జె.భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: