రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'కబాలి'. గతంలో రజనీకాంత్ నటించిన ఏ మూవీకి లేనంత క్రేజ్ ఈ కబాలి మూవీకి వచ్చింది. అందుకే కబాలి మూవీ రీజనల్ మూవీలాగా కాకుండా భారీ ఇంటర్నేషనల్ హంగుతో రిలీజ్ అయింది. ఇక బిజినెస్ పరంగానూ ఇది ఇంటర్నేషనల్ రేంజ్ లోనే రిలీజ్ అయింది. అందుకు కారణం కేవలం స్టార్ హీరో రజనీకాంత్ మాత్రమే.

రజనీకాంత్ ని మాస్ గెటప్ లో బాషా తరహా చిత్రంలో చూడటానికి అభిమానులు చూపిన క్రేజ్ కి కబాలి పై హైప్ క్రియేట్ అయింది. అయితే కబాలి మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఆనాటి నుండి ఈ మూవీ కలెక్షన్స్ పై అంతటా చర్ఛనీయాంశంగా మారింది. నిజానికి ఈ రేంజ్ లో ఏ మూవీ అయినా రిలీజ్ అయితే ఆ మూవీ కలెక్షన్స్ ని నిర్మాతలు గోప్యంగా ఉంచుతారు.

అలాగే అభిమానులు సైతం ఆ మూవీ కలెక్షన్స్ ఎలా వచ్చాయి అనే దానిపై ఎక్కడ సమాచారాన్ని తెలుసుకోవాలో తెలియక కొంత ఇబ్బంది పడిపోతారు. ఇదిలా ఉంటే కబాలి మూవీ విషయంలో మాత్రం పూర్తి రివర్స్ లో జరుగుతుంది. కబాలి నిర్మాత కలైపులి థాను..ఈ మూవీ మొదటి రోజే 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టిందని, అలాగే మొదటి మూడు రోజులకి 400 కోట్ల రూపాయలను కొల్లగొట్టిందని చెప్పటం స్టార్ట్ చేశారు.

అయితేకబాలి మూవీ మొదటి రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో నిర్మాత చెప్పిన రిపోర్ట్ కి చాలా మంది రిపోర్టర్స్ షాక్ అయ్యారు. దీంతో నిర్మాత కచ్ఛితంగా ఫేక్ రిపోర్ట్స్ చెబుతున్నారు అనేది అందరూ నిర్ణయించుకున్నారు. దీంతో నిన్న సాయంత్రం కలెక్షన్స్ నిమిత్తం నిర్మాత ప్రెస్ మీట్ అనౌన్స్ చేశారు. దీనికి ఒకరిద్దరు రిపోర్ట్స్ తప్పితే అందరూ కాకపోవటంతో ఆ ప్రెస్ మీట్ ని నిర్మాత క్యాన్సిల్ చేసుకోవటం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: