తన అల్లరి నటనతో అలరిస్తూ వస్తున్నమంచు మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ కి ఘోర అవమానం జరిగింది. ఆ మద్య కరెంట్ తీగ చిత్రంతో మంచి హిట్ సాధింన మనోజ్ రీసెంట్ గా నటించిన   శౌర్య అట్లర్ ఫ్లాప్ కావడంతో తన తదుపరి చిత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.  అయితే ఈ రాకింగ్ స్టార్ నెక్ట్స్ చిత్రంలో మెగా హీరోయిన్ ని కథానాయికగా ఎంపిక చేయాలనుకున్నారట అయితే వెంటనే  ఈ విషయాన్ని ఆ మెగా హీరోయిన్ కి తెలపడం ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. తర్వత ఏమైందో ఏమో కానీ సరైన సమయంలో మనోడికి హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిందట. దీంతో షాక్ తిన్న చిత్ర యూనిట్ మరో హీరోయిన్ వేటలో ఉన్నట్లు తెలుస్తుంది.


ఇంతకీ ఆ మెగా హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..! ఆమె మరెవ్వరో కాదండీ.. మెగా బ్రదర్ నాగబాబు అబ్బాయి వరుణ్ తేజ, క్రిష్ కాంబినేషన్ లోవచ్చిన ‘కంచె’ చిత్రం హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.  ఈ అమ్మడు మిర్చిలాంటి కుర్రోడు చిత్రంలో నటించినా పెద్దగా పేరు రాలేదు..తర్వాత వరుణ్ తేజతో నటించిన కంచె చిత్రం మంచి పేరు తెవడమే కాకుండా వెంటనే మంచి ఆఫర్లు కూడా కొట్టేసింది.

అయితే టీ. సత్య దర్శకత్వంలో రూపొంద బోతున్న ఈ మూవీ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమా కావలసిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందట. కానీ సడెన్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇందుకు సరైన కారణాలు లేకపోయినా మంచు మనోజ్ కి మాత్రం బాగా అవమానం జరిగిందని చిత్ర యూనిట్ అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’  షూటింగ్ లో బిజీగా ఉండటం..మరో రెండు ఆఫర్ల లో ఇప్పటికే కమిట్ అవ్వడం జరిగిందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: