అదేంటీ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి షాకింగ్ న్యూస్ ఎంటా అనుకుంటున్నారా..! ఆ మద్య ఓ సినిమా షూటింగ్ లో సల్మాన్ ఖాన్ వేటకు వెళ్లి అక్కడ కృష్ణ జింకను షూట్ చేసిన కేసు గత 20 సంవత్సరాలుగా వదట బొమ్మాళీ వదలా.. అంటూ పట్టి పీడించింది. రిసెంట్ గా సల్మాన్ ఖాన్  ని నిర్దోషిగా రాజస్తాన్ హైకోర్టు విడిచి పుచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మళ్ళీ చిక్కుల్లో పడనున్నాడా..? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.   అప్పట్లో సల్మాన్ వినియోగించిన జిప్సీ వాహనాన్ని నడిపి  హరీష్ దులానీ ఇన్నేళ్ళకు ప్రత్యక్షం కావడంతో ఇలాంటి అనుమానాలు తలెత్తాయి. ఆ కేసులో దులానీ కీలక సాక్షి. గత 18 సంవత్సరాలుగా దులాని కనిపించకుండా పోయి ఇన్నాళ్ల తర్వాత ప్రత్యక్షం కావడం సల్మాన్ కి షాకింగ్ న్యూస్.

అయితే ఇంతకాలం తాను భయంతో బతికానని, కోర్టు విచారణకు హాజరయ్యేందుకు ఎప్పుడు ప్రయత్నించినా బెదిరింపు కాల్స్ అందేవని తెలిపాడు. కాగా 1998 ప్రాంతంలో సల్మాన్ వినియోగించిన జిప్సీ వాహనాన్ని దులానీ నడిపాడు. వారం పాటు సల్మాన్  తోనే ఉన్నాడు.  గతంలో సల్మాన్ కృష్ణ జింకను వేటాడాడని అప్పట్లో మేజిస్ట్రేట్ కోర్టుకు చెప్పానని, కానీ ఆ తర్వాత వాంగ్మూలానికి తనను పిలవలేదని ఇతగాడు చెప్పాడు.  అయితే అప్పట్లో తాను ఇచ్చిన వాంగ్మూలానికి ఇంకా కట్టుబడి ఉన్నట్లు దులానీ చెబుతున్నాడు. అయితే  ఎప్పుడు ఈ కేసు గురించి కోర్టుకు హాజరు కావాలని చూసినా.. నా తండ్రికి బెదిరింపు కాల్స్ వచ్చేవని నీ కొడుకును చంపేస్తాం అని బెదిరించే వారని ఇది తెలుసుకున్న తాను భయంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయా అని తెలిపాడు.

పోలీసు రక్షణ ఉంటే తిరిగి మూడో కేసులో కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నానని హరీష్ దులానీ అంటున్నాడు.  అయితే తాను ఎదుర్కోబోయేది సెలబ్రెటీలను అని తన ప్రాణానికి ముప్పుు ఉందని అంటున్నాడు దులాని. నన్ను ఎవరైనా గుర్తు పడతా రేమోనన్న భయంతో వేరే జాబ్ కోసం ప్రయత్నించలేదు అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఎవరి ప్రోద్బలం వల్ల బయటకు వచ్చాడో మాత్రం సస్పెన్స్ లో పెట్టాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: