లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తీసుకున్న యూటర్న్ తెలుసుకుని దర్శక రత్న దాసరి నారాయణ రావు షాక్ అయినట్లు వార్తలు వినపడుతున్నాయి. పవన్ తన సినిమాల విషయమై ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఆ ప్రాజెక్టుల లిస్టులో పవన్ దాసరిల మూవీ ప్రాజెక్ట్ కనీసం చర్చల స్థాయికి కూడ చేరుకోక పోవడంతో ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తుంది అనుకున్న సినిమా శాస్వితంగా అటక ఎక్కినట్లే అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

పవన్ డాలీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ టీ నీసన్ లతో సినిమాలు  చేయడానికి స్పష్టమైన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈసినిమాల నిర్మాతలు రాధాకృష్ణ ఎ.మ్. రత్నంలు ఈసినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ వర్గాలు బయట పెడుతున్న సమాచారం మేరకు పవన్ దగ్గర ఇక కేవలం ఇద్దరు ప్రముఖ నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ లు మాత్రమే మిగిలి ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 

అయితే పవన్ మాత్రం దాసరి దగ్గర ఎటువంటి అడ్వాన్స్ లుతీసుకోలేదని దాసరి ఒకటి రెండు సార్లు ఈ అడ్వాన్స్ ప్రస్తావన పవన్ దగ్గర తీసుకు వచ్చినా పవన్ చాల సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈమధ్య కాలంలో దాసరి పవన్ వద్ద కొన్ని కథలు వినమని చెప్పినా డానికి పవన్ పెద్దగా ఆసక్తి చూపించక పోవడంతో పవన్ యూటర్న్ తీసుకున్నాడు అన్న విషయo దాసరికి అర్థం అయింది అని అంటున్నారు.
 

పవన్ నుంచి 2017 లో  రెండు  సినిమాలు వస్తే మహాయితే 2018 లో మరొక సినిమా మించి పవన్ నుంచి వచ్చే నేపధ్యం లేకపోవడంతో దాసరి మరోసారి ప్రయత్నించినా పవన్ నుంచి సానుకూల స్పందన రావడం చాల కష్టమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించే ఇప్పటికే దాసరి రెండు సార్లు పవన్ తో కదిపే ప్రయత్నం కూడా చేసారని వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: