చైతూ సమంతలు ఈ మధ్యన కొద్ది రోజులుగా జంటగా ఎక్కడా కలిసి సందడి చేయకపోవడంతో ఈ ప్రేమ పక్షులు ఎందుకు మౌనం వహించారు అంటూ రకరకాల ఊహాగానాలు మీడియాలో హడావిడి చేసాయి. కొన్ని మీడియా వర్గాలు అయితే చైతూ సమంతలకు నాగార్జున పెద్ద క్లాస్ పీకాడు అన్న వార్తలు కూడ ప్రచారంలోకి తీసుకు వచ్చారు.
అయితే ఈ ప్రేమ జంట భాగ్యనగరం వదిలి ఎటువంటి మీడియా సమస్యలు లేని బెల్జియంలో సందడి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరొక ట్విస్ట్ ఏమిటంటే ఈ ప్రేమ పక్షుల లవ్ ట్రిప్ వెనుక రానా రావితేజాల హస్తం ఉంది అన్న వార్తలు కూడ హడావిడి చేస్తున్నాయి.
ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం రానా రవితేజా రకుల్ ప్రీత్ రెజీనా కోన నీరజ లతో పాటు మరి కొందరు గ్రూప్ గా బెల్జియంలో జరుగుతున్న మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొనడానికి సరదాగా టూర్ వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే ఆ టూర్ లో సమంత నాగ చైతన్యలు కలిసి సందడి చేసినా వారిద్దరి ఫోటోలు బయటకురాకుండా చాల జాగ్రత్తలు తీడుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా జాగ్రత్తలు తీసుకోవడం వెనుక వీర్ధరికి ఈమధ్యన నాగార్జున ఇచ్చిన భారీ క్లాస్ కారణం అని అంటున్నారు. ఏమైనా నాగ చైతన్య ఒకవైపు తన తండ్రి సలహాలు అనుసరిస్తూనే రోజురోజుకు సమంత ప్రేమలో పీకలలోతులో మునిగిపోయాదనుకోవాలి..