సినిమా ఇండస్ట్రీలో కొంత మంది కాంబినేషన్ లో సినిమాలు వస్తే అవి ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాయని నమ్మకం ఉంటుంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, వివివినాయక్ లాంటి వారు కొంత మంది హీరోతో మాత్రమే ఇప్పటి వరకు సినిమాలు రెండు మూడు తీశారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్  కాంబినేషన్ లో స్టూడెంట్ నెం.1, సింహాద్రి చిత్రం తర్వాత యమదొంగ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిప్పిన చిత్రాలు కూడా ఇవే అని చెప్పొచ్చు. ఈ ఇద్దరూ ఇద్దరే..ఒకరు నటనకు మారు పేరు అయితే  మరొకరు ఒక బొమ్మని చెక్కినట్టు చాలా అందంగా సినిమాని తీసే దర్శక దిగ్గజం. అయితే యమదొంగ వచ్చి ఆగస్ట్ కి 8 సంవత్సరాలు అవుతుంది.  రాజమౌళి ఆ మద్య ఎన్టీఆర్ తో ఓ సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి..అయితే ప్రస్తుతం బాహుబలి 2 సినిమా బిజీలో తలమునకలై పోతున్న రాజమౌళి ఇప్పటి వరకు ఈ సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ల సమయం పట్టింది.

ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ మొదలవుతుందని అందరూ ఊహించారు. రాజమౌళి కూడా తారక్  అని చెన్నై లో ఒక కాలేజ్ స్టూడెంట్స్ అడిగినప్పుడు  చెప్పకనే చెప్పాడు .  ఆ రోజు నుండే అభిమానులు అందులో తారక్ హీరో అని ఫిక్స్ అయ్యి పోయి ఆ సినిమా కోసం  వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు .కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి జక్కన్న హ్యండ్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం సూపర్ స్టార్ అని తెలుస్తుంది..ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారు. ఈ మద్య కబాలి చిత్రంతో రికార్డుల మోత మోగిస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనే చెప్పాలి.  

రజిని రోబో.2  తర్వాత  రాజమౌళి తో సినిమా చేయటానికి అంగీకరించినట్టు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి . రజిని తో సినిమా చేయాలి అని రాజమౌళి కి ఎప్పటినుండో తీరని కోరిక . అయితే తారక్  కూడా జనత గ్యారేజ్ తర్వాత  వక్కంతం వంశీ సినిమా కళ్యాణ్ రామ్ నిర్మాత గ చేయబోతున్నాడు . ఆ తర్వాత పూరి జగన్నాధ్ చిత్రం తెరకెక్క బోతుంది . ఈ రెండు చిత్రాలు పూర్తి కావటానికి  ఎంత లేదన్న  రెండు సంవత్సరాలు పడుతుంది. ఇక ఎన్టీఆర్, జక్కన్న కాంబినేషన్ సినిమా రావాలంటే 2018 దాటి పోతుందని అనుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: