జ్యోతిలక్ష్మి సినిమా తరువాత పూరి జగన్నాథ్ చార్మీలపై చాలా గాసిప్పులు వచ్చాయి. అయితే ఆ తరువాత ఆ వార్తలను వారిద్దరూ ఖండించినా వారిద్దరి మధ్య ఇంకా స్నేహం కొనసాగుతూనే ఉంది అని చాలామంది అంటారు. ఈ వార్తలు ఇలా ఉండగా పూరి చార్మీ ఆలోచనలు అనుసరిస్తూ ఇప్పుడు ఒక కోత్త వ్యాపారం మొదలు పెడుతున్నాడు అని  వార్తలు వస్తున్నాయి.

 సినిమా రంగంలో సెటిల్ అయిపోయిన వాళ్లు, కొత్త వ్యాపారాలను ప్రారంభించడం ఒక ట్రెండ్ గా మారిపోయిన నేపధ్యంలో టాలీవుడ్ సేలిబ్రిటీలు అంతా రరకాల వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ఇప్పడు ఆ  లిస్టు లోకి  టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడాచేరి పోవడం టాపిక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఇప్పటికే ఛార్మీబాలీవుడ్ బ్యూటీలను టాలీవుడ్ కి తెచ్చే పనిలో బిజీగా ఉంది. రీసెంట్ గా రాజ్ తరుణ్ మూవీలో అమైరా దస్తూర్ సైన్ చేయడంవెనుక ఛార్మీనడిపిన యంత్రాంగమే అని అంటారు. ఈ విషయాలను తెలుసుకున్న పూరి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఒక  వ్యాపారంగా మార్చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. పూరీకి బాలీవుడ్ సినిమారంగంతో మంచి పరిచియాలు  ఉండటంతో వాటిని ఉపయోగించుకోవడానికి ముంబైలోని ఒక  మోడలింగ్ ఏజన్సీతో కలిసి పూరి క్యాస్టింగ్ ఏజన్సీ స్టార్ట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఔత్సాహిక నటులను ట్యాలెంట్ ఉన్న మోడల్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే ఈ క్యాస్టింగ్ ఏజన్సీ పని. హాట్ హీరోయిన్స్ ను ఇంట్రడ్యూస్ చేయడంలోదిట్ట అయిన పూరి ఈ వ్యాపారం లో బాగా సక్సెస్స్  అవుతాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గా  దిశాపటనానీ అదితి ఆర్య లాంటి హీరోయిన్సను తీసుకొచ్చిన పూరీ ఇంకా రానున్న రోజులలో ఇంకా ఎంతమంది హాట్ బ్యూటీలను తీసుకు వస్తాడో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి .



మరింత సమాచారం తెలుసుకోండి: