సావిత్రి పేరు వింటే మనకు పురాణాలకు సంబంధించిన ఎన్నో కథలు గుర్తుకు వస్తాయి. కంప్యూటర్ యుగంలో ఉన్నా ఎక్కడో అక్కడ ప్రతి వ్యక్తికి సతీ సావిత్రి కథ గుర్తుకు వస్తుంది. అయితే ఆ సతీ సావిత్రిని తలదన్నే మోడ్రన్ సావిత్రి వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఎన్నో వివాదాలకు తెర తీస్తోంది.

ప్రస్తుతం ఈ మోడ్రన్ సావిత్రి సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్స్ తో బాలీవుడ్ మీడియా హోరెత్తి పోతోంది. పరమ్ గిల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నిహారికా రైజాదా 'సావిత్రి' పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ కు ప్రప్రధమంగా ఈసినిమా ద్వారా హాలీవుడ్‌ సెక్స్‌బాంబ్‌ లూసీ పిండర్‌ని పరిచయం చేస్తున్నారు.
పురాణాల్లో సావిత్రికి మోడ్రన్‌ టచ్‌ అంటూ ఈ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తూ ఈసినిమాను డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు. రజత్‌ బర్మేచా, ఓమ్‌ పురి, గుల్షన్‌ గ్రోవర్‌ లాంటి ప్రముఖ నటులు నటిస్తున్న ఈసినిమా ఒక రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా ఆగస్ట్‌ 25న విడుదల కాబోతోంది.

ఇక ఈసినిమా విడుదల కాకుండానే వివాదాలలోకి వెళ్ళి పోతోంది. అలనాటి సావిత్రికి మోడ్రన్‌ టచ్‌.. అంటూ చేస్తున్న ప్రచారం హిందూ మత సంప్రదాయాల్ని దెబ్బతీస్తున్నాయి అంటూ ఈ 'వారియర్‌ సావిత్రి' కి వ్యతిరేకంగా అప్పుడే ఉద్యమాలు కూడ మొదలు అయ్యాయి. అవసరం అనుకుంటే కోర్టుకు వెళ్ళి ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలని కూడ చూస్తున్నారు. అయితే ఈసినిమా గురించి అందరికంటే ఎక్కువగా సన్నీలియోన్ భయపడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ సెక్సీ బ్యూటీగా బాలీవుడ్ ను షేక్ చేస్తున్న స్ననీలియోన్ హవాకు హాలీవుడ్ సెక్సీ బ్యూటీ లూసీ పిండర్ ఎక్కడ టెండర్ పెడుతుందో అని సన్నీలియోన్ తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: